మహేష్ సినిమాలో ట్విస్ట్ బయటికొచ్చేసింది!

Update: 2018-06-26 06:48 GMT

వంశీ పైడిపల్లి - మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న మహేష్ 25వ మూవీ తాజాగా డెహ్రాడూన్ లో రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టేసుకుంది. పీవీపీతో వచ్చిన గొడవలను దిల్ రాజు అండ్ బ్యాచ్ చక్కబెట్టేసి.. పీవీపీ కూడా ఈ సినిమాకొక నిర్మాతగా భాగస్వామ్యం ఇచ్చి సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లిపోయారు. ఈ సినిమాలో కాలేజ్ కుర్రాడిలా కనిపించనున్న మహేష్.. ఆ కాలేజ్ గెటప్ కోసం న్యూ లుక్ ట్రై చేశాడు. కాలేజ్ కుర్రాడిలా గెటప్ మర్చేసాడు. ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే తో మహేష్ బాబు మొదటిసారి జోడి కడుతున్నాడు. అలాగే అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు.

వంశీ మార్క్ ట్విస్ట్ ఇదే...

తాజాగా మహేష్ 25వ మూవీ విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఒకటి బయటికొచ్చింది. అదేమిటంటే అల్లరి నరేష్, మహేష్ బాబు లు ఈ సినిమాలో స్నేహితులుగా కనబడతారనేది ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్న విషయమే. ఇక మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా రిచ్ గా కనబడితే.. అల్ల్లరి నరేష్ పూర్ గా కనబడతాడనేది కూడా ప్రచారం జరిగింది. తాజాగా ఈ సినిమాలో అల్లరి నరేష్ కేరెక్టర్ చనిపోతుంది. అయితే అల్లరి నరేష్ మృతికి గల కారణాలను కనిపెట్టే విషయంలో మహేష్ బాబు ఎదుర్కున్న సమస్యలను వంశీ పైడిపల్లి తన స్టయిల్లో చూపించబోతున్నాడట.

మళ్లీ గమ్యం గుర్తుకు వస్తుందా..?

మరి అల్లరి నరేష్ గతంలో క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన గమ్యం సినిమాలోనూ తన కేరెక్టర్ చనిపోయే పాత్ర వేసాడు. శర్వానంద్, అల్లరి నరేష్ లు స్నేహితులుగా తెరకెక్కిన గమ్యం సినిమాలో క్లైమాక్స్ లో అల్లరి కేరెక్టర్ ని చంపేస్తారు. ఇక ఆ సినిమా ఫీల్ గుడ్ మూవీ గా అందరి మన్ననలు పొందింది. హీరోగా అల్లరి నరేష్ ప్రస్తుతం అస్సలు ఫామ్ లేడు. మరి మహేష్ సినిమాలో ఇలా ఫ్రెండ్ కేరెక్టర్ ద్వారా తిరిగి మళ్ళీ క్రేజ్ లోకి వస్తాడేమో చూడాలి.

Similar News