'నన్ను దోచుకుందువటే' సక్సెస్ మీట్ కు మహేష్..?

Update: 2018-09-27 06:18 GMT

సుధీర్ బాబు - నభా నటేష్ జంటగా నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమా గత వారం రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ దక్కిచుకుంది. టాక్ అయితే పర్లేదు అని వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం డల్ అయ్యాయి. ఫస్ట్ వీకెండ్ అంతంత మాత్రమే వచ్చిన కలెక్షన్స్ ను మరింత పెంచాలని నిర్మాత సుధీర్ బాబు ఓ ప్లాన్ వేస్తున్నాడు. అందుకుగాను అతను ఈ సినిమాకు సంబంధించి ఓ సక్సెస్ మీట్ ను భారీ లెవెల్ లో ప్లాన్ చేయనున్నాడు.

మహేష్ రాకతో వసూళ్లు పెరుగుతాయని...

సుధీర్ బాబు సినిమా ప్రమోషన్స్ కి ముందుగానే మహేష్ బాబు రావడం కామన్. అయితే ఈ సినిమాకు మహేష్ బాబు కొన్ని కారణాలు వల్ల రాలేకపోయాడు. అయితే ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ చీఫ్ గెస్ట్ గా రానున్నాడు మహేష్. ఆల్రెడీ మహేష్ ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో వెల్లడించాడు. అంతేకాదు సుధీర్ బాబుని మెచ్చుకున్నాడు. మళ్లీ ఇప్పుడు సక్సెస్ మీట్ కి వస్తే సినిమాకి బజ్ ఉంటుంది. సినిమాకు ఎలాగో పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి మహేష్ వచ్చి కొంచం బూస్ట్ అప్ చేస్తే సెకండ్ వీక్ కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశముందని సుధీర్ ఆశపడుతున్నాడు. మరో రెండు మూడు రోజుల్లో ఈ మీట్ ఉండొచ్చని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నభాకు మంచి పేరు రావడమే కాదు పెద్దపెద్ద సినిమా నుండి ఆఫర్స్ వస్తున్నాయి.

Similar News