తన పిల్లల్ని చూస్తే గర్వంగా ఉందంట..!

Update: 2018-08-02 07:42 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఎంతో అపురూపం అయినప్పటికీ.. తమ పిల్లలు గౌతమ్, సితారలు దగ్గర మాత్రం మహేష్ బాబు ఒక సాధారణ తండ్రి లాగే ప్రవర్తిస్తాడు. అందరి నాన్నల్లాగే వారిని వెకేషన్స్ కి తీసుకెళ్లడమే కాదు.. వారు చేసే అల్లరిని చూసి పొంగిపోతాడు కూడా. సినిమాల్లో సూపర్ స్టార్ అయినప్పటికీ... ఒక ఫ్యామిలీ మాన్ గా మహేష్ కి మంచి పేరుంది. కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి ఆడుకోవడం, ఎంజాయ్ చెయ్యడం వెకేషన్స్ కి వెళ్లడం అంటే మహేష్ కి ఎంతిష్టమో సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న ఫొటోస్ లో స్పష్టంగా అర్థమవుతుంది. తన పిల్లల్ని ఎంతో చక్కగా బాధ్యతగా చూసుకుంటాడు మహేష్. ఇక తాజాగా తన పిల్లలను చూసి గర్వపడుతున్నానంటూ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసాడు. మరి మహేష్ తన పిల్లలు ఏం చేస్తే అంత గర్వపడ్డాడో మీరే చూడండి.

తండ్రి ఛాలెంజ్ పూర్తిచేసిన పిల్లలు

మహేష్ బాబు కేటీఆర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి తన తోటలో కూతురితో కలిసి ఒక మామిడి మొక్కను నాటాడు. మరి అలా మొక్కను నాటిన మహేష్ బాబు తన కూతురు సితారకు, కొడుకు గౌతం, దర్శకుడు వంశి పైడిపల్లికి కూడా ఈ గ్రీన్ ఛాలెంజ్ ని విసిరాడు. అయితే వంశి పైడిపల్లి తనకు మహేష్ ఇచ్చిన ఛాలెంజ్ ని వెంటనే పూర్తి చేసేయ్యగా.. సితార, గౌతమ్ లు నిన్న స్కూల్ నుండి రాగానే ఇంటి పెరట్లోనే గ్రీన్ ఛాలెంజ్ ని పూర్తి చేశారు. గౌతమ్ కృష్ణ, సితార తమ మొక్కలను నాటి తమ తండ్రి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. మహేష్ ఈ ఫొటోలతో పాటు తన బిడ్డలను చూసి గర్విస్తున్నా అంటూ ట్వీట్ చేసాడు. మరి తండ్రి ఛాలెంజ్ ని స్వీకరించి వెంటనే పని పూర్తి చేసిన గౌతమ్, సితారలను మనమూ అభినందించేద్దామా...!

Similar News