మహర్షి విలన్ పై మహేష్ ఫాన్స్ అసంతృప్తి..!

Update: 2018-11-24 07:01 GMT

వంశీ పైడిపల్లి - మహేష్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో 8 కోట్లతో వేసిన పల్లెటూరి సెట్ లో జరుగుతుంది. దిల్ రాజు బ్యాచ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. సోనాల్ చౌహన్ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ లో నటిస్తుందనే ప్రచారం ఉంది. ఇకపోతే ఈ మహర్షి మూవీలో అల్లరి నరేష్.. మహేష్ ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా అమెరికాలోని న్యూ యార్క్ లో కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకుంది. మహేష్ ఈ సినిమాలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలు అంటే ఒకటి ఒక పెద్ద కంపెనీ సీఈఓ గానూ మరొకటి రైతు పాత్రలోనూ కనిపించనున్నాడు.

విలన్ గా సాయికుమార్...

అయితే ఈ సినిమా మహేష్ ని ఢీ కొట్టబోయే పవర్ ఫుల్ విలన్ పాత్రలో విలక్షణ నటుడు సాయికుమార్ నటించబోతున్నాడు. సాయికుమార్ మెయిన్ విలన్ గా నటిస్తున్నడని... ఇంకొంతమంది విలన్స్ కూడా ఉంటారని చెబుతున్నారు. మరి వంశీ పైడిపల్లి గత చిత్రమైన ఎవడు సినిమాలో రామ్ చరణ్ కి ధీటుగా విలన్ పాత్రలో సాయి కుమార్ ఇరగదీశాడు. అందుకే ఈసారి మహర్షి కోసం కూడా వంశీ పైడిపల్లి విలన్ గా సాయి కుమార్ నే దించుతున్నాడు. కానీ ఇప్పుడు ఈ విలన్ విషయంలో మహేష్ ఫాన్స్ మాత్రం కాస్త అసంతృప్తిగా ఉన్నారంటున్నారు.

స్థానిక నటుడు కావడంతోనే...

ఎందుకంటే ఇప్పుడున్న స్టార్ హీరోలంతా బాలీవుడ్ విలన్స్ పెట్టుకుని సినిమాలు చేస్తుంటే... మహేష్ మాత్రం ఇలా టాలీవుడ్ నటుడితోనే పని కానిచ్చేస్తున్నారు. అయితే ఈ విలన్ విషయంలో మహర్షి క్రేజ్ తగ్గుతుందనే భావనలో మహేష్ ఫాన్స్ ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి నిజంగా మహేష్ ఫాన్స్ అంటున్నారని కాదు గానీ... రామ్ చరణ్ వినయ విధేయ రామలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ తో తలపడుతుంటే ... సాహో సినిమాలో ప్రభాస్ నీల్ నితిన్ ముఖేష్ తో తలపడుతున్నాడు. మరి మహేష్ ఇలా లోకల్ నటుడితో పని కనిచ్చెయ్యడం మహేష్ ఫాన్స్ కి రుచిందడం లేదు. అయితే సాయికుమార్ కూడా తక్కువ నటుడేమి కాదు. అయన డైలాగ్ డెలివరీ, ఫేస్ లోని క్రూరత్వం అన్ని కూడా విలన్ గా ఆయన్ని ఒక స్థాయిలో తీసుకెళ్లే అంశాలే.

Similar News