మహేష్… వంశీకి మేలు చేస్తున్నాడా?

మహర్షి సినిమా తరవాత వంశి పైడిపల్లి మళ్ళీ మహేష్ కోసమే ఎదురు చూస్తూ ఉండిపోయాడు కానీ.. కొత్త కథ రాసుకోకుండా కొత్త హీరో కోసం ట్రై చెయ్యకుండానే [more]

Update: 2020-07-08 09:04 GMT

మహర్షి సినిమా తరవాత వంశి పైడిపల్లి మళ్ళీ మహేష్ కోసమే ఎదురు చూస్తూ ఉండిపోయాడు కానీ.. కొత్త కథ రాసుకోకుండా కొత్త హీరో కోసం ట్రై చెయ్యకుండానే ఉన్నాడు. కానీ మహేష్ మాత్రం వంశీకి హ్యాండ్ ఇచ్చి పరశురామ్ తో సర్కారు వారి పాట చేస్తున్నాడు. మళ్ళీ స్క్రిప్ట్ సిద్ధం చెయ్యి తర్వాత చూద్దామని వంశీని తిప్పుకుంటున్న మహేష్ ఇప్పుడు వంశీకి మేలు చేయబోతున్నాడనే టాక్ వినబడుతుంది. మహేష్ బాబు ఇప్పుడు నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే అడవి శేష్ తో మేజర్ సినిమాని నిర్మిస్తున్న మహేష్ బాబు.. తర్వాత శర్వానంద్ తో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు.

అయితే మహేష్ ఇంతకుముందు విజయ్ దేవరకొండ తో సినిమా చెయ్యాలని అన్నాడు. కానీ అది కుదరలేదు. తాజాగా మహేష్ – విజయ్ దేవరకొండ కాంబోలో మూవీ రాబోతుందని.. అది కూడా  వంశి పైడిపల్లి దర్శకత్వంలో అంటూ ప్రచారం జరుగుతుంది. వంశి పైడిపల్లి మహేష్ కాదన్న తర్వాత రామ్ చరణ్ తో అయినా, ప్రభాస్ తో అయినా సినిమా చేస్తాడనే ప్రచారం కూడా జరిగింది. కానీ తాజాగా మహేష్ – విజయ్ కాంబో సినిమాని చేస్తాడని అంటున్నారు. విజయ్ దేవరకొండ భరత్ అనే నేను అప్పటినుండే మహేష్ కాంపౌండ్ లో వాళ్ళ పార్టీస్ లో కనిపించడంతో వంశి దర్శకత్వంలో మహేష్ నిర్మాణంలో విజయ్ సినిమా ఉండినా ఉండొచ్చు.. కొట్టి పారెయ్యలేం అంటున్నారు.

Tags:    

Similar News