మహేష్ మనస్సు మార్చుకున్నాడు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మహర్షి రికార్డ్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తన 25వ చిత్రం ల్యాండ్ మార్క్ చిత్రం కావడంతో [more]

Update: 2019-05-22 07:32 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మహర్షి రికార్డ్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తన 25వ చిత్రం ల్యాండ్ మార్క్ చిత్రం కావడంతో డైరెక్టర్ వంశీ పైడిప‌ల్లి మరో సినిమా డైరెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో హాలిడే ట్రిప్ కి వెళ్లారు. తిరిగి రాగానే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2020 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ముందే వంశీతో సినిమా

ఈ మూవీ తరువాత మహేష్ వెంట‌నే ప‌ర‌శురామ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లాలి. కానీ మహేష్ మ‌న‌సు మార్చుకున్నాడ‌ని స‌మాచారం. ప‌ర‌శురామ్ సినిమా కంటే ముందు వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. అనిల్ సినిమా త్వరగా కంప్లీట్ చేసి వంశీ సినిమాను 2020 వేస‌విలో ప‌ట్టాలెక్కిస్తారు. మరి అప్పటి వరకు ప‌ర‌శురామ్ ఖాళీగానే కూర్చోవాలా లేదా ఈ గ్యాప్ లో వేరేహీరో తో ఓ సినిమా చేసి వస్తాడా చూడాలి.

Tags:    

Similar News