ముంబై టు షిర్డీ.. ఏంటి మహేశు…

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్ అవ్వాలని దేవుళ్ళని మొక్కేస్తున్నాడు. సరిలేరు షూటింగ్ కంప్లీట్ చెయ్యడమే కాదు.. సరిలేరు తన కేరెక్టర్ డబ్బింగ్ కూడా పూర్తి [more]

Update: 2019-12-30 10:24 GMT

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా హిట్ అవ్వాలని దేవుళ్ళని మొక్కేస్తున్నాడు. సరిలేరు షూటింగ్ కంప్లీట్ చెయ్యడమే కాదు.. సరిలేరు తన కేరెక్టర్ డబ్బింగ్ కూడా పూర్తి చేసి ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ముంబై చెక్కేసాడు. నమ్రత, గౌతమ్, సితారాలతో రెండు రోజుల క్రితమే ముంబై వెళ్లిన మహేష్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ప్రిపేర్ అవడం లేదు.. ముంబై నుండి సాయి బాబా ని దర్శించుకోవడానికి షిర్డీ వెళ్ళాడు. ఫ్యామిలీ తో పాటుగా సాయి బాబా ని దర్శించుకుని సరిలేరు నీకెవ్వరూ హిట్ అవ్వాలని కోరుకుని.. తిరిగి ముంబై చేరుకున్నాడు. ఇక మహేష్ కంపౌండ్ లోనే తిరుగుతున్నా మెహెర్ రమేష్ ఎప్పటిలాగే… మహేష్ ఫ్యామిలీ తో షిర్డీ దర్శనానికి వెళ్ళాడు.

ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరూ పక్కా హిట్ అంటూ మహేష్ ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. సరిలేరు పాటలకొస్తున్న ఫీడ్ బ్యాక్ తో కాస్త డిస్పాయింట్ అయిన మహేష్ ఫ్యాన్స్.. పాటలు వీక్ అయితే సినిమా హిట్టే అంటున్నారు. మరి మహేష్ బాబు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కన్నా ముందు షిర్ది సాయి ని దర్శించుకుని.. రావడం మాత్రం అందరూ కాస్త ఆశ్చర్యంగానే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మహేష్ బదులు నమ్రత తిరుపతి వెళ్లి మొక్కులు తీర్చుకుని వస్తుంటుంది. మహేష్ ఎపుడో కానీ… దేవుళ్ళ దర్శనానికి రాదు.. ఎందుకంటే మహేష్ ఆల్వేస్ బిజీ కాబట్టి. అందుకే ఇప్పుడు షిర్డీ దర్శనం అంతగా హాట్ టాపిక్ అయ్యింది.

Tags:    

Similar News