విడుదలకు సమయమే లేదు.. కూల్ గా వున్న హీరోలు

సంక్రాంతికి విడుదల కాబోతున్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ సినిమాల హీరోలేమో కానీ.. ఆయా హీరోల ఫ్యాన్స్ మధ్యన మాత్రం కోల్డ్ వారు కాదు సోషల్ మీడియా [more]

Update: 2020-01-03 04:42 GMT

సంక్రాంతికి విడుదల కాబోతున్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ సినిమాల హీరోలేమో కానీ.. ఆయా హీరోల ఫ్యాన్స్ మధ్యన మాత్రం కోల్డ్ వారు కాదు సోషల్ మీడియా వార్ ఓ రేంజ్ లో సాగుతుంది. జనవరి 11, 12 రెండు రోజులు థియేటర్స్ హోరెత్తిపోయేలా తమ హీరోలకు ట్రీట్ ఇవ్వాలని మహేష్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. మరి దర్శకులు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి కూడా టార్గెట్ రీచ్ అయ్యేందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పబ్లిసిటీ పనులతో క్షణం తీరికలేదు. అల వైకుంఠపురములో షూటింగ్ కంప్లీట్ చేసి తన డబ్బింగ్ పూర్తి చేసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం అల్లు అర్జున్ భార్య తో సహా వెకేషన్ కి చెక్కేసాడు. మరోపక్క మహేష్ కూల్ గా షిర్డీ దర్శనం, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అంటూ ఫ్యామిలీతో ముంబై వెళ్ళాడు. ఈరోజో రేపో హైదరాబాద్ కి చేరుకోనున్న ఈ హీరోలిద్దరూ ఐదారు తారీకుల్లో తమ సినిమాల ఈవెంట్స్ లో పాల్గొనబోతున్నారు.

ఇక సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ముగిసాక… మహేష్, ఆలు అర్జున్ లు మీడియా తో ముచ్చట్లు పెడతారు. ఎలాగూ రెండు సినిమాల మీద బోలెడంత క్రేజ్, హైప్ ఉంది. ఇక హీరోలందుకే కూల్ గా తమ పనులు తాము చేసుకుపోతున్నారు.. తప్పితే ప్రస్తుతం మీడియా కంటికి దొరకడం లేదు. ఇక రేపటినుండి ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఛానల్స్ కి ఇంటర్వూస్, వెబ్ అండ్ ప్రింట్ మీడియాతో ముచ్చట్లు అబ్బో నాలుగైదు రోజులు మీడియా వాళ్ళకి ప్రెస్ మీట్స్ ప్రెస్ మీట్స్. మరి ఇద్దరు హీరోల పిఆర్ టీం కూడా పక్కా ప్లానింగ్ తో పబ్లసిటీ వ్యవహారాలు చక్కబెడుతున్నాయి

Tags:    

Similar News