ఫైనల్ గా మహేష్ పారితోషకం

మహేష్ బాబు తాజా చిత్ర సరిలేరు నీకెవ్వరూ కి మహేష్ బాబు అక్షరాలా 50 కోట్ల పారితోషకం అందుకున్నాడనే న్యూస్ సరిలేరు నీకెవ్వరూ సినిమా మొదలైనప్పటినుండి జరుగుతుంది. [more]

Update: 2019-12-13 05:50 GMT

మహేష్ బాబు తాజా చిత్ర సరిలేరు నీకెవ్వరూ కి మహేష్ బాబు అక్షరాలా 50 కోట్ల పారితోషకం అందుకున్నాడనే న్యూస్ సరిలేరు నీకెవ్వరూ సినిమా మొదలైనప్పటినుండి జరుగుతుంది. సినిమా బడ్జెట్ లో సగం మహేష్ కే పోతుందని అన్నారు. ఇక సౌత్ లో అంత పెద్ద మొత్తం అందుకున్న హీరోల్లో మహేష్ నెంబర్ వన్ ప్లేస్ అన్నారు. అయితే సరిలేరు నీకెవ్వరూ నాన్ థియేట్రికల్ రైట్స్ కింద వచ్చిన మొత్తం మహేష్ అకౌంట్ లో జమ ఔతాయని… మహేష్ బాబు క్రేజ్ తో 50 కోట్లు నాన్ థియేట్రికల్ రైట్స్ తో రావడం ఖాయమని అందుకే మహేష్ పారితోషకం 50 కోట్లుగా డిసైడ్ చేసారు.

అయితే తాజాగా సరిలేరు నీకెవ్వరూ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు కింద దాదాపుగా 45 కోట్ల దాక వచ్చాయట. శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో 30 కోట్లు రాగా… భారీ ధర వస్తుంది అని అంచనా వేసిన హిందీ మర్కెట్ కి 15 కోట్లు వచ్చాయని.. మొత్తం కలిపి 45 కోట్లు నాన్ థియేట్రీక రైట్స్ రూపంలో సరిలేరుకి వచ్చాయని, ఇక ఆ మొత్తం మహేష్ బాబు కే పోతాయని.. ఫైనల్ గా మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాకి తీసుకున్న పారితోషకం 45 కోట్లుగా లెక్క తేలింది. మరి 45 కోట్లయినా.. ఇంత భారీ పారితోషకం తీసుకున్న ఏకైన హీరో మహేషే

Tags:    

Similar News