విజయశాంతి కాలేజ్ లో ఏం చేస్తుంది

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబోలో జెట్ స్పీడు గా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. నిన్నటివరకు అన్నపూర్ణ [more]

Update: 2019-08-14 06:10 GMT

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబోలో జెట్ స్పీడు గా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. నిన్నటివరకు అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన స్పెషల్ ట్రైన్ సెట్ లో షూటింగ్ చేసిన సరిలేరు నీకెవ్వరు టీం.. ప్రస్తతం నల్సార్ లా యూనివర్సిటీలో షూటింగ్ చిత్రీకరణ జరుపుతుంది. ఇప్పటికే సినిమా ఇంటర్వెల్ కి ముందు వచ్చే సినిమా షూటింగ్ ని దాదాపుగా కొన్ని సీన్స్ మినహా అనిల్ రావిపూడి పూర్తి చేసాడంటున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న మొదటిసారి మహేష్ తో జోడీకడుతుంటే.. విజయశాంతి, బండ్ల గణేష్ లాంటి సీనియర్ నటులు ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఇకపోతే ఆగష్టు తొమ్మిదిన మహేష్ బర్త్ డే రోజున మహేష్ లుక్ ని రివీల్ చేసింది మూవీ టీం. ఆర్మీ ఆఫీసర్ లుక్ లో మహేష్ అదరగొట్టేసాడు. కేవలం మహేష్ అభిమానులకే కాదు…. అందరిని మహేష్ లుక్ ఇంప్రెస్స్ చేసింది. ఇకపోతే ఈ సినిమాలో విజయశాంతి ఓ కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సెట్ లో అడుగుపెట్టిన విజయశాంతి ఈ సినిమాలో ఒక ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతుందని.. అందుకే చిత్ర బృందం అంతా ప్రస్తుతం హైదరాబాద్ లోని నల్సార్ లా యూనివర్సిటీ లో షూటింగ్ చిత్రీకరణ చేస్తున్నట్టుగా టాక్. ఈ యూనివర్సిటీ సన్నివేశాల తర్వాత సరిలేరు నీకెవ్వరు టీం రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ అవుతుంది. మహేష్ – రశ్మిక ల ఈ సరిలేరు నీకెవ్వరు సినిమా ని 2020 సంక్రాతి కానుకగా విడుదలకు డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే

Tags:    

Similar News