మ‌హేష్ త‌ర్వాత సినిమా అత‌డితోనే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రాన్ని చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహర్షి అనే టైటిల్ పెట్టారు. [more]

Update: 2019-02-13 08:25 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రాన్ని చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహర్షి అనే టైటిల్ పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా తరువాత మహేష్.. సుకుమార్ డైరెక్షన్ లో ఓ చేయనున్నాడు. అయితే సుకుమార్ మహేష్ కు ఎన్ని కథలు వినిపించినా అవి సెట్ అవ్వకపోవడంతో రీసెంట్ గా సుకుమార్ మరో లైన్ తో వచ్చి మహేష్ ను ఇంప్రెస్స్ చేసాడట. కథ విన్న మహేష్ వెంటనే ఓకే చేసే ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మన్నాడు. అయితే తాజా సమాచారం సుకుమార్ ఈ కథ ఫుల్ గా రెడీ చేయడానికి ఆరు నెలలు సమయం కావాలని సుకుమార్ అడగడంతో, ఈ లోగా మరో దర్శకుడితో మరో సినిమా చేసేయాలనే నిర్ణయానికి మహేశ్ బాబు వచ్చేశాడని అంటున్నారు.

అనిల్ రావిపూడితో…

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ తో ఓ మూవీ చేయాల్సి ఉంది. కానీ ఆ డైరెక్టర్ ప్రస్తుతం బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ చేసే పనిలో ఉన్నాడు. ఇంతకుముందే మహేష్ కి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించి ఓకే చేయించుకున్నాడు. త్వరగా పూర్తి స్క్రిప్ట్ రెడీ చేస్తే సినిమా చేద్దాం అని మహేష్ అనిల్ తో చెప్పినట్టు టాక్. అందుకే అనిల్ ప్రస్తుతం ఎక్కడా బయటికి రాకుండా ఈ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఓకే అయితే దిల్ రాజు నిర్మించనున్నాడు.

Tags:    

Similar News