అందరిని పక్కనబెట్టి కూల్ అంటున్న మహేష్ బాబు

మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా దగ్గరనుండి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకు పోతున్నాడు. మహర్షి, తర్వాత సరిలేరు నీకెవ్వరూ రెండు సినిమాలు అనుకున్న టైం [more]

Update: 2020-01-11 01:53 GMT

మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా దగ్గరనుండి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకు పోతున్నాడు. మహర్షి, తర్వాత సరిలేరు నీకెవ్వరూ రెండు సినిమాలు అనుకున్న టైం కి పూర్తి చేసిన మహేష్ బాబు ఈసారి మాత్రం మూడు నెలల గ్యాప్ తీసుకోబోతున్నాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమా ఈ రోజే ప్రేక్షకులముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉన్నప్పటికీ… మహేష్ తదుపరి సినిమా మూడు నెలలు ఆగి మొదలెడతాడట. అది కూడా మహర్షి డైరెక్టర్ వంశి పైడిపల్లితో.. మహర్షి సినిమా తర్వాత మహేష్ కోసం ఎదురు చూస్తున్న వంశి మల్లి మహేష్ తోనే సినిమాకి సిద్దమయ్యాడు.

అయితే మహేష్ తో సుకుమర్ సినిమా ని మహేష్ కావాలనే ఆపేసాడు. తర్వాత సందీప్ వంగా తో అన్నారు..అది చడీ చప్పుడు లేదు. మహేష్ కూడా స్పందించకపోవడంతో అదీ లేనట్లే. ఇక పరశురామ్ మహేష్ తో సినిమా అంటున్నాడు. మహేష్ మాత్రం పరశురాంతో సినిమాపై ఎక్కడా మాట్లాడలేదు. మరోపక్క మహేష్ బాబు కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని మీట్ అయ్యాయని.. ఆ మీటింగ్ కి అర్ధం సినిమా ఉంటుంది అని కాదని.. ప్రశాంత్ నీల్ తో సినిమా ఉండొచ్చు.. ఉండకపోవొచ్చు అంటున్నాడు. మరి సందీప్ వంగ, పరశురామ్, సుక్కు, ప్రశాంత్ నీల్ ఇలా అందరిని పక్కనబెట్టి కూల్ అంటూ మూడు నెలలు గ్యాప్ తీసుకోనున్నాడు మహేష్.

Tags:    

Similar News