ప్రొడ్యూసర్స్ ఉన్నా… మహేషే చూసుకుంటున్నాడు..!

ప్రస్తుతం మహేష్ బాబు – వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మహర్షి రీసెంట్ గా షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని మరో షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తుంది. [more]

Update: 2019-02-02 10:03 GMT

ప్రస్తుతం మహేష్ బాబు – వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మహర్షి రీసెంట్ గా షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని మరో షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తుంది. అయితే ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలని అందరికీ తెలిసిన విషయమే. దిల్ రాజు, పీవీపీ, అశ్విని దత్ ముగ్గురు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరితో ఒకరికి పడటం లేదని తెలుస్తుంది. కారణం సినిమాకు సంబంధించి బిజినెస్‌ వ్యవహారాలతో పాటు మీడియా కవరేజ్‌లో దీనిని తన సినిమాగా ప్రొజెక్ట్‌ చేసుకుంటున్నాడని దిల్‌ రాజుపై మిగిలిన ఇద్దరు నిర్మాతలు మహేష్‌కి కంప్లయింట్‌ చేస్తున్నారట.

విడుదల తేదీకి కారణమదే..!

అందుకే సినిమా ఏప్రిల్ 5న విడుదల చేయాలి అనుకున్నా విడుదల తేదీ మారడానికి ఈగోలే కారణమని తెలుస్తోంది. ప్రొడ్యూసర్స్ మధ్య ఈగోస్ రావడంతో మహేష్ రంగంలోకి దిగాడు. సినిమాకు సంబంధించి బిజినెస్ వ్యహారాలు అన్నీ మహేషే చేసుకుంటున్నాడని టాక్. ఎవరికి ఎంత రేట్ కి అమ్మాలి అనేది మహేషే డిసైడ్ చేస్తున్నాడట. మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

Tags:    

Similar News