మహేష్ కోరుకున్నది ఇదేనా..?

మహేష్ బాబు.. కొరటాల శివతో కలిసి భరత్ అనే నేను సినిమా చేస్తున్నప్పుడే వంశీ పైడిపల్లి ఒక స్టోరీ లైన్ వినిపించి మహేష్ బాబుతో సినిమా కమిట్ [more]

Update: 2019-05-11 06:27 GMT

మహేష్ బాబు.. కొరటాల శివతో కలిసి భరత్ అనే నేను సినిమా చేస్తున్నప్పుడే వంశీ పైడిపల్లి ఒక స్టోరీ లైన్ వినిపించి మహేష్ బాబుతో సినిమా కమిట్ చేయించాడు. వంశీ పైడిపల్లికి దిల్ రాజు అండదండలు ఉండడంతో నమ్రతతో ఈ సినిమాని డీల్ చేసిన దిల్ రాజు బ్యాచ్ ఈ సినిమాని మొదలుపెట్టేసింది. ఇక వంశీ పైడిపల్లి పూర్తి స్క్రిప్ట్ పట్టుకుని దేవిశ్రీతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేసి మహేష్ కోసం దాదాపుగా చాలా నెలల పాటు వెయిట్ చేసాడు. మహేష్ కూడా వంశీ పైడిపల్లి కథకు బాగా కనెక్ట్ అవడంతో.. తన కెరీర్ లో ఈ 25వ సినిమా ఎప్పటికీ మరిచిపోలేనిదిగా ఉంటుందని నమ్మాడు. ఇక దిల్ రాజుతో అశ్వినీదత్, మరో నిర్మాత పీవీపీ క‌లవడంతో ఈ సినిమాకి వంశీ పైడిపల్లి ఎడాపెడా ఖర్చు పెట్టించాడు.

బోలెడంత ఖ‌ర్చు…

మామూలుగానే వంశీ పైడిపల్లి రిచ్ గా సినిమాలు చేస్తాడనే టాక్ ఉంది. ఇక మహర్షికి కూడా వంశీ నిర్మాతలు ముగ్గురి చేత బాగానే ఖర్చు పెట్టించాడు. దాదాపుగా పది నెలల పాటు సినిమా చిత్రీకరిస్తూనే ఉన్నాడు వంశీ. మధ్యమధ్యలో రీ షూట్స్ గట్రా ఇలా ఈ సినిమాకి తడిసి మోపెడు బడ్జెట్ అయ్యింది. మహర్షి సినిమాలో స్టూడెంట్ పాత్ర, ఒక బడా కంపెనీ సీఈవో పాత్ర, అలాగే రైతుల కోసం పోరాడే వ్యక్తి పాత్రకి మహేష్ బాగా కనెక్ట్ అయినట్లుగా మహర్షి సినిమా చూశాక కానీ అర్ధం కాదు. అయితే ఈ స్టూడెంట్, సీఈవో, రైతు పాత్రలను కనెక్ట్ చెయ్యడానికి వంశీ పైడిపల్లి చాలానే కష్టపడ్డాడు. రైతు ఎపిసోడ్ కి మంచి పేరొచ్చినా.. సినిమాలో లెక్కకు మించి సోషల్ మెస్సేజ్ లు ఉన్నాయి. ఇక ఇలాంటి సినిమాలలో స్క్రీన్ ప్లే క్రిస్పీగా ఉండాలి. కానీ వంశీ మాత్రం స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డాడు.

మ‌హేష్ చుట్టూనే క‌థ‌

ఇక కథ మొత్తం మహేష్ చుట్టూనే తిప్పే క్రమంలో మిగతా పాత్రలను పూర్తిగా వాడుకోలేకపోయాడు. అందులో ప్రకాష్ రాజ్, పూజ హెగ్డే, జయసుధ లాంటి క్యారెక్టర్స్ అలా ఉండిపోవాల్సిన‌ పరిస్థితి. మరి మహేష్ కథలో హీరో పాత్రకే ఎక్కువ వాల్యూ ఇచ్చి మిగతా వారిని విస్మరించాడా అనిపిస్తుంది. అసలు మహేష్ 25వ సినిమా ఇలానే ఉండాలని కోరుకున్నాడా? లేదంటే మారేదన్నానా అంటేమహేష్ అనుకున్నంతగా మహర్షి సినిమాని ప్రేక్షకులు ఆదరించేలా కనబడడం లేదు. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ.. చాన్నాళ్లుగా బాక్సాఫీస్ డల్ గా ఉండడంతో మహర్షికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అందులోనూ మహేష్ క్రేజ్ అలాంటిది. అందుకే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా ఈ వీకెండ్ లో కలెక్షన్స్ బాగున్నా… సోమవారం నుండి డ్రాప్ అయ్యేలానే కనబడుతుంది. ఇప్పటికే శని, ఆదివారాల్లో మహర్షి టికెట్స్ ఈజీగా దొరికేస్తున్నాయి.

Tags:    

Similar News