సినిమా ఆగింది..కానీ స్నేహం చెడలేదు

మహేష్ బాబు తో వంశీ పైడిపల్లి జర్నీ కి ఫుల్ స్టాప్ పడింది. వంశీ మహర్షి తర్వాత మల్లి మహేష్ తో సినిమా ప్లాన్ చేసుకోవడం మహేష్ [more]

Update: 2020-03-02 05:28 GMT

మహేష్ బాబు తో వంశీ పైడిపల్లి జర్నీ కి ఫుల్ స్టాప్ పడింది. వంశీ మహర్షి తర్వాత మల్లి మహేష్ తో సినిమా ప్లాన్ చేసుకోవడం మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగినా.. ఆ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు. కారణం మహేష్ కి స్క్రిప్ట్ నచ్చకపోవడం అంటున్నారు. అయితే మహేష్ మహర్షి అప్పటినుండి ఫ్యామిలీ తో రిలేషన్ కంటిన్యూ చేస్తున్న వంశి పైడిపల్లి మహేష్ తో సినిమా ఆగినతర్వాత మహేష్ కి దూరంగా వెళ్లాడని, మహేష్ అల చేసినందుకు బాధపడుతున్నాడని అన్నారు. నిజంగానే మహేష్ ఫ్యామిలీతో వంశి పైడిపల్లి ఫ్యామిలీ మమేకం అవడం, కూతురు ఆద్యతో మహేష్ కూతురు సితార ఫ్రెండ్ షిప్ చెయ్యడమే కాదు.. సరిలేరు అప్పుడు మహేష్ ని ఈ పిల్లలిద్దరూ ఇంటర్వ్యూ చెయ్యడం, తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి హడావిడి చెయ్యడం అన్ని జరిగాయి. మహేష్ తో సినిమా ఆగిపోయాక వంశి పైడిపల్లి మహేష్ ఫ్యామిలికి దూరమయ్యాడనే న్యూస్ కూడా నడిచింది.

అయితే తాజాగా మహేష్ – వంశి పైడిపల్లి మధ్యన సినిమా అయితే ఆగింది కానీ….. రిలేషన్ చెడలేదు అనడానికి ఓ ప్రూఫ్ దొరికింది. ఆదేమిటంటే రీసెంట్ గా హైదరాబాద్ పార్క్ హైయ్యత్ లో నటి జయసుధ పెద్ద కొడుకు నీహార్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కి మహేష్ వైఫ్ నమృత శిరోద్కర్ తో కలిసి వంశి పైడిపల్లి హాజరవడం చూసిన వారెవరైనా మహేష్ తో సినిమా ఆగినా మహేష్ ఫ్యామిలీతో వంశి పైడిపల్లి స్నేహం అలాగే ఉందిగా అంటున్నారు. మరి మహేష్ వైఫ్ నమ్రతతో కలిసి వంశి పైడిపల్లి కూడా వధువరులతో ఫోటో దిగాడు. అలాగే నమ్రత కూడానే వంశీ కూడా ఉండడం చూస్తుంటే వీళ్ళ స్నేహం ఎక్కడా చెక్కు చెదరలేదనిపిస్తుంది

Tags:    

Similar News