ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన మహేష్!!

Update: 2018-04-14 13:37 GMT

మహేష్ గత రెండు సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరచటమే కాకుండా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఖచ్చితంగా భరత్ అనే నేను సినిమా ద్వారా అందర్నీ ఎంటర్ టైన్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొరటాల - మహేష్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిజల్ట్ పై కూడా చాలా నమ్మకంతో ఉన్నాడు మహేష్ బాబు.

నిరాశకు గురి చేయను....

సినిమాపై ఇంకా బజ్ క్రియేట్ చేసేందుకు మహేష్ ప్రొమోషన్స్ స్టార్ట్ చేసాడు. లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. " నేను చేసి ప్రతి సినిమా మంచిగా ఉండాలని ఆడియన్స్ కోరుకుంటారు. నన్ను నమ్మి తమ డబ్బులు ఖర్చు పెట్టి మరి నా సినిమా చూసేందుకు థియేటర్స్ వస్తారు. అలాంటివారిని నేను నిరాశకు గురి చేయకూడదనే నా ప్రతి సినిమా చాలా జాగ్రత్తగా అలోచించి ఎంచుకుంటాను.’’ అని మహేష్ చెప్పారు.

జూన్ లో వంశీ పైడిపల్లితో....

‘‘ఒక సినిమా సమాజంలో మార్పు తెస్తుందంటే నేను అటువంటి సినిమాలు చేయటానికి ముందుంటాను. ఈ భరత్ అనే నేనులో కూడా అటువంటి ఒక ఆలోచనలో మార్పు వస్తుందని అనుకుంటున్నా. నేను పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతానని చాలా మంది అంటున్నారు. కానీ నాకు సినిమానే ప్రపంచం. పాలిటిక్స్ గురించి పట్టించుకోను. బాహుబలి - అర్జున్ రెడ్డి లాంటి సినిమా టాలీవుడ్ రేంజ్ ని మార్చేశాయి. అటువంటి సినిమా ఎప్పుడు వస్తుండాలని నేను కోరుకుంటాను. ఇక దర్శకుడిగా మహేష్ ను చూడొవచ్చా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఏమో చెప్పలేం. యాక్టింగ్ ని ప్రస్తుతం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక వంశీ పైడిపల్లి తో సినిమా జూన్ లో స్టార్ట్ కానుందని " మహేష్ తెలిపాడు.

Similar News