మహేష్ తో మెగా నిర్మాత?

Update: 2018-06-22 06:34 GMT

భరత్ అనే నేను తో హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం వంశి పైడిపల్లి డైరెక్షన్ లో తన కెరీర్ లో మైలు రాయి అయిన 25 వ సినిమా చేస్తున్నాడు. అనేక సమస్యలను పరిష్కరించుకుని ఎట్టకేలకు వంశి - మహేష్ ల మూవీ పట్టాలెక్కింది. ముగ్గురు బడా నిర్మాతల కాంబోలో మహేష్ 25 మూవీ తెరకెక్కుతుంది. దిల్ రాజు, పీవీపీ, అశ్విని దత్ ల కలయికలో ఈ సినిమా లాంఛనంగా సెట్స్ మీదకెళ్లింది. పీవీపీ తో సెటిల్మెంట్ చేసుకుని.... ఆయన్ని కూడా ఈ సినిమాలో ఒక నిర్మాతగా కలుపుకుని మహేష్ బృందం ముందుకు సాగుతుంది. అయితే మహేష్, వంశి తో సినిమా తర్వాత రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇక సుకుమార్, మహేష్ తో చేసే సినిమా ని మైత్రి మూవీస్ లో చేస్తానని ఎప్పుడో చెప్పాడు.

తాజాగా మహేష్ తో గీత ఆర్ట్స్ బ్యానర్లో మెగా నిర్మాత అల్లు అరవింద్ ఒక సినిమా చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈమధ్యనే అల్లు అరవింద్ - మహేష్ కలిసి కూర్చుని ఒక సినిమా చేద్దామని మాట్లాడుకున్నారని... కానీ తమ బ్యానర్ లో మహేష్ చేసే సినిమాకి ఇంకా డైరెక్టర్ సెట్ కాలేదని... డైరెక్ట్ సెట్ అయితే మహేష్ సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లుగా గీత ఆర్ట్స్ లీకులిస్తుంది. మరి ఎప్పుడూ మెగా హీరోల చుట్టూ తిరిగే అరవింద్ ఈ మధ్యన చిన్న చిన్న బయట హీరోలతో ను సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా గీత ఆర్ట్స్ బ్యానర్ లో గీత గోవిందం తెరకెక్కుతుంది.

అయితే మహేష్ తో గీత ఆర్ట్స్ వారు నిర్మించబోయే సినిమా సందీప్ వంగా డైరెక్షన్ లో ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే మహేష్ తర్వాతి లిస్ట్ లో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా ఉన్నాడు. ఇప్పటికే సందీప్ వంగా మహేష్ వైఫ్ నమ్రతతో మహేష్ తో తనకో మూవీ ఉంటుందని... ఆమె నుండి మాట తీసుకున్నాడని టాక్ ఉంది. కానీ అది ఏ బ్యానర్ లో ఉంటుందనే క్లారిటీ లేదు.. కానీ ఇప్పుడు గీత ఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ మూవీ కి కమిట్ అయ్యాడనే న్యూస్.. సందీప్ వంగా తో చెయ్యబోయే మూవీ ఇప్పటివరకు బ్యానర్ నేమ్ ఇవ్వకపోవడంతో... సందీప్ వంగా తో మహేష్ మూవీ గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే అనే న్యూస్ కూడా ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

Similar News