మహేష్ పరువు తీసిన డైరెక్టర్..?

Update: 2018-10-27 07:38 GMT

ప్రిన్స్ మహేష్ బాబు, డైరెక్టర్ మెహెర్ రమేష్ మంచి స్నేహితులు అని అందరికి తెలిసిన విషయమే. బాబీ మూవీ నుండి వీరిద్దరూ మంచి స్నేహితులు. మహేష్ ఎక్కడికి వెళ్లినా తనతో పాటు రమేష్ కూడా వెళ్తుంటాడు. మహేష్ కు విజయవాడలో రియల్ ఎస్టేట్ యాడ్స్ రావడానికి కారణం రమేషే అని టాక్. అటువంటి రమేష్.. మహేష్ ను దెబ్బ తీసాడు. ఈ నెల 27న అమెరికాలో 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' వాళ్లు ఒక ఫండ్ రైజింగ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కోసం టికెట్ కొనుకున్న వాళ్లు అక్కడ మహేష్ తో కూర్చుని డిన్నర్ చేసే అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి టిక్కెట్ ధరలు కూడా 500, 1000, 1500 డాలర్స్ గా ఫిక్స్ చేశారు.

టిక్కెట్స్ అమ్ముడుకాక...

దీనికి సంబంధించి ప్రమోషన్ కోసం మహేష్ బాబుని పెట్టి మెహెర్ రమేష్ ఓ డాక్యుమెంటరీ రెడీ చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అతను చేసిన డాక్యుమెంటరీలో పస లేదని.. దాని వల్ల మహేష్ చెరిష్మా పెరగకపోగా.. నిరాసక్తత కలిగిందని చూసినవాళ్లు చెప్పారు. దీంతో ఈ ఈవెంట్ కి కనీసం 20 టిక్కెట్లు కూడా అమ్ముకోలేక నిర్వాహకులు చేతులెత్తేశారు. ఆలా ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఈ ఈవెంట్ రద్దవడంతో ఓవర్సీస్‌లో మహేష్‌బాబు పరువు పోయింది. దీనికి మెహెర్ రమేషే కారణం అని చాలా మంది అంటున్నారు.

Similar News