‘మహర్షి’లో అదే హైలెట్ అంట..!

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో మొదటిసారిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దిల్ రాజు ఎఫ్ 2తో [more]

Update: 2019-01-19 06:35 GMT

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో మొదటిసారిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దిల్ రాజు ఎఫ్ 2తో ఈ ఏడాది బోణి చేసాడు. ఇప్పుడు మహర్షి సినిమా తోనూ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దిల్ రాజుతో పాటు పీవీపీ, అశ్వినీదత్ లు కూడా మహర్షి మూవీ నిర్మాతలే. ముగ్గురు బడా నిర్మాతలు మహర్షి సినిమాకి భారీగానే బడ్జెట్ పెడుతున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ మహేష్ కి ఫ్రెండ్ గా కీ రోల్ లో నటిస్తున్నాడని.. ఈ సినిమా మొత్తం రైతు సమస్యల చుట్టూనే తిరుగుతుందని తెలిసిందే.

రైతుల కోసం పనిచేసే వ్యక్తిగా..

తాజాగా మహర్షి ఇంటర్వెల్ బ్యాంగ్ అదుర్స్ అని చెబుతున్నారు. బాగా ధనిక కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి… ప్రేమాభిమానాలు, స్నేహపూర్వకంగా మహర్షిగా ఎలా మారాడు అనేది సినిమా కథ అని.. మహర్షి సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటెర్టైనెర్ గా ఉంటుందని… సెకండ్ హాఫ్ కాస్త సీరియ‌స్ ఎమోష‌న్స్‌ తో న‌డ‌వ‌బోతోందని… అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ సినిమాకి అత్యంత కీల‌కం అంటున్నారు. ఇక అక్క‌డే మహేష్(రిషి)లో మార్పు వ‌స్తుంద‌ట‌. అప్పటి నుండి రిషి తన బాధ్య‌తేంటో తెలుసుకుని రైతులకి ఉపయోగపడుతూ.. క‌థ మ‌రో మ‌లుపు తిప్పుతాడని చెబుతున్నారు.

అల్లరి నరేష్ ది కీలక పాత్ర

అలాగే తన ఎదుగుదలకు కారణమైన ఫ్రెండ్ కష్టాల కడలిలో ఉన్నాడని తెలుసుకుని… ఆ ఫ్రెండ్ ని ఆదుకోవడానికి మహేష్ అమెరికా నుండి పల్లెటూరికి వస్తాడని అంటున్నారు. అదే మహేష్ మారడానికి కారణం అవుతుందంటున్నారు. ఇక మహేష్ ఫ్రెండ్ అల్లరి నరేష్(రవి) పాత్ర సెకండ్ హాఫ్ లో కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక మహేష్ – అల్లరి నరేష్ మధ్యన వచ్చే ఫ్రెండ్షిప్ సీన్స్ సినిమాకి హైలెట్ అంటున్నారు.

Tags:    

Similar News