మహర్షి ఎక్కడం లేదే…!!

దేవిశ్రీ ప్రసాద్ మనసు పెట్టి మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుంది.. గత ఏడాది సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమా చెబుతుంది. రంగస్థలం మ్యూజిక్, బ్యాగ్రౌండ్ [more]

Update: 2019-04-13 04:32 GMT

దేవిశ్రీ ప్రసాద్ మనసు పెట్టి మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుంది.. గత ఏడాది సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమా చెబుతుంది. రంగస్థలం మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్ని బ్లాక్ బస్టర్. కానీ దేవిశ్రీ చాలా సినిమాలకు అలా మనసు పెట్టలేకపోతున్నాడా? లేదంటే ఎమన్నా ప్రాబ్లమా అనేది డౌట్. దేవిశ్రీ మహర్షి సినిమా కి రెండేళ్ల క్రితం నుండే ట్యూన్స్ కట్టాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ కి వంశి పైడిపల్లి, దేవిశ్రీ ప్రసాద్ లు మహర్షి మొదలవడానికి ఆరు నెలల ముందే అమెరికా వెళ్లినట్లుగా వార్తలొచ్చాయి. మరి అంతలా మనసు పెట్టి చేసిన మహర్షి సాంగ్స్ ఒక్కొక్కటిగా బయటికొస్తుంటే.. మనసుకు హత్తుకోవాలి గని.. ఆ సాంగ్స్ వింటుంటే చాలా సాదా సీదాగా అనిపిస్తున్నాయి.

దేవిశ్రీ మహర్షి కి ఇచ్చిన మ్యూజిక్ చూస్తుంటే గత ఏడాది మహేష్ తో భరత్ అనే నేను సినిమా మ్యూజిక్ గుర్తుకు వస్తుంది. మహర్షి ఫస్ట్ సింగల్ సో సో గా ఉంటే.. తాజాగా విడుదలైన సెకండ్ సింగల్ నువ్వే సమస్తం అనే లిరిక్స్ తో సాగే ఈ పాట నిజానికి ఓ మాంటేజ్ సాంగ్. కానీ శ్రీమణి రాసిన సాహిత్యం ఆశించిన స్థాయిలో లేకపోగా.. దేవిశ్రీ అందించిన సంగీతంలో కూడా కొత్తదనం కనిపించలేదు. మహేష్ అభిమానులు శ్రీమంతుడు, భారత అనే నేను సాంగ్స్ తో మహర్షి పోటీ పడుతుందనుకున్నారు. కానీ మహర్షి సింగిల్స్ లో పస లేకపోవడంతో.. మహర్షి సాంగ్స్ విడుదలవుతున్న కొద్దీ సినిమా మీద అంచనాలు తగ్గుతాయేమో అని అభిమానులు భయపడుతున్నారు. మరి 140 కోట్ల బిజినెస్ తో థియేటర్స్ లోకి దిగుతున్న మహర్షి ఇప్పుడు ఈ మ్యూజిక్ విషయంలో ఇలా అంచనాలు తగ్గితే అది సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశం లేకపోదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.

Tags:    

Similar News