మహర్షి కోసం పల్లెటూరిని దింపుతున్నారు..!

Update: 2018-10-06 06:26 GMT

డాషింగ్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు 'మహర్షి' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్ టీజర్ లో మహేష్ బాబు గడ్డంతో కనిపించడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లో జరగనుంది. అమెరికా షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ జరగనుంది. అందుకుగాను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ కోసం ఒక పల్లెటూరి సెట్ ని వేయబోతున్నారట మూవీ యూనిట్. దానికి సంబంధించిన వర్క్ కూడా చకచకా జరిగిపోతుందని సమాచారం. ప్రస్తుతం మహేష్ అండ్ టీం అమెరికాలో ఉన్నారు.

భారీ ఖర్చుతో సెట్

ఈ షెడ్యూల్ పూర్తయ్యే సమయానికి ఈ భారీ సెట్ ని పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశారు యూనిట్. 20 రోజుల పాటు నాన్ స్టాప్ గా ఈ సెట్ లో షూటింగ్ జరగనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దిల్ రాజు, అశ్విని దత్, పీవీపీలు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా విడుదల అవ్వబోతుంది. భారీ బడ్జెట్ తో ఈ సెట్ ను వేస్తున్నట్టు అర్థం అవుతుంది.

Similar News