స్టూడెంట్ నుండి సీఈఓ గా మహేష్..?

Update: 2018-09-24 07:01 GMT

కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో యంగ్ సీఎంగా అదరగొట్టేసాడు. మహేష్ అందానికి సీఎం లుక్ లో ఎలా ఉంటాడో అనుకుంటే.. సినిమా చూసిన వాళ్లు యంగ్ సీఎం, స్టైలిష్ సీఎం అంటూ పొగిడేశారు. తాజాగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహేష్ 25వ సినిమా మహర్షి సినిమాలో మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా ఇరగదీస్తాడనే టాక్ ఉంది. కేవలం టాక్ మాత్రమే కాదు.. మహర్షి టీజర్ లోనూ మహేష్ బుక్స్ చేతిలో పట్టుకుని కాలేజ్ లో అలా నడిచొస్తుంటే... ఆ స్టైలిష్ నడక, అందానికే అమ్మాయిలు పడిపోతారనిపిస్తుంది. మరి కాలేజ్ లో అల్ల్లరి నరేష్ తో స్నేహం చేసే మహేష్ బాబు తర్వాత విదేశాలకు వెళ్లిపోతాడని ఒక స్టోరీ ప్రచారంలోఉంది.

ఫారిన్ షెడ్యూల్ లో...

అది నిజం కాకపోతే.. మహర్షికి సంబంధించిన భారీ షెడ్యూల్ ఒకటి అమెరికాలో ప్లాన్ చేసాడు వంశీ పైడిపల్లి. కానీ కొన్ని కారణాలతో మహేష్ మహర్షి టీం యూఎస్ షెడ్యూల్ లేట్ అవుతూ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 2వ వారం నుంచి మహర్షి ఫారిన్ షెడ్యూల్ షూటింగును అమెరికాలో ప్రారంభించనున్నారు. 25 రోజుల పాటు అక్కడ జరగనున్న షూటింగులో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు, రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అయితే నిన్నటివరకు మహేష్ స్టూడెంట్ గురించే డిస్కర్షన్ జరిగింది. తాజగా మహేష్ బాబు మహర్షిలో స్టూడెంట్ మాత్రమే కాకుండా ఓ కంపెనీకి సీఈవో గా కూడా కనిపించబోతున్నాడట.

సీఈవో లుక్ లో...

ఒక ఐటి కంపెనీ లో మహేష్ బాబు సీఈవో గా కనిపిస్తాడని.. యూఎస్ లో జరిగే షూటింగ్ లో మహేష్ ఐటి కంపెనీ, సీఈవో సీన్స్ నే వంశీ పైడిపల్లి చిత్రీకరించబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. మరి ఇప్పటికే మహేష్ బాబు స్టూడెంట్ లుక్ లో ఇరగదీసాడు. ఇక యంగ్ సీఈవో లుక్ లో ఎలా ఉండబోతున్నాడో అంటూ మహేష్ ఫ్యాన్స్ అప్పుడే... ఊహించేసుకుంటున్నారు. ఇకపోతే పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.

Similar News