మహర్షిలో ఆ ఎపిసోడ్ హైలైట్ అంట..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ తరువాత చేస్తున్న చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో [more]

Update: 2019-04-22 09:38 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ తరువాత చేస్తున్న చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. మహేష్ జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ ఫ్రెండ్ పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. దిల్ రాజు, పీవీపీ, అశ్వినిదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్ అవ్వబోతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన ఒక విషాదం కూడా చూపించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

పసర్లపూడి సంఘటన చూపిస్తారా..?

1995 జనవరి లో ఈస్ట్ గోదావరి జిల్లాలో పసర్లపూడి అనే గ్రామం వద్ద ఒక పెద్ద పైపులైన్ పేలిపోవడంతో మంటలు ఎగసిపడ్డాయి.భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద అగ్ని ప్రమాదం. ఏకంగా 25 గ్రామాలను బూడిదగా మార్చింది ఈ విపత్తు. తాజా సమాచారం ప్రకారం ఈ ఇన్సిడెంట్ ను సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది. సినిమాకి ఈ ఎపిసోడ్ టర్నింగ్ పాయింట్ గా మారుతుందని చెబుతున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మే 9 వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News