మహర్షి వచ్చేశాడు..!

మహేష్ బాబు – పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ముగ్గురు నిర్మాతల నిర్మాణంలో తెరకెక్కుతున్న మహర్షి మూవీ ప్రమోషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యాయి. [more]

Update: 2019-03-29 07:45 GMT

మహేష్ బాబు – పూజా హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ముగ్గురు నిర్మాతల నిర్మాణంలో తెరకెక్కుతున్న మహర్షి మూవీ ప్రమోషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యాయి. మే 9న విడుదల కాబోతున్న మహర్షి మూవీ సాంగ్స్ ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి దిగుతున్నాయి. నిన్నటిదాకా సాంగ్ పోస్టర్స్ అంటూ హల్చల్ చేసిన మహర్షి టీం తాజాగా మహర్షి ఫస్ట్ సాంగ్ ని వదిలింది. పూజా హెగ్డే, మ‌హేష్‌, అల్లరి న‌రేష్ స్నేహం, వారి ప్రయాణం నేప‌థ్యంలో ఛోటీ ఛోటీ బాతే అంటూ మొదలయ్యే పాటని వదిలింది చిత్ర బృందం. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ పాట ఆసాంతం ఆకట్టుకునేలా ఉంది.

స్నేహానికి విలువ ఇచ్చేలా…

ఈ పాట విడుదల చేసాక డైరెక్టర్ వంశీ పైడిపల్లి ట్విట్టర్ లో ‘‘ప్రతి స్నేహానికి ఓ కథ ఉంది. ఈ పాట వింటూ మీ కథని గుర్తు చేసుకోండి. మీ స్నేహాన్ని ఉత్సవంగా జరుపుకోండి’’ అంటూ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. మరి మహర్షి సినిమా మొదటినుండి చెప్పినట్టుగా స్నేహానికి ఎక్కువ విలువను ఇస్తూ సాగుతుందనేది ఇప్పుడు దర్శకుడు వంశీ ట్వీట్ తోనూ, అలాగే ఈ ఛోటీ ఛోటీ బాతే పాటతోనూ నిజమైంది. మరి ఉగాదికి మహర్షి టీజర్ ని విడుదల చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది కానీ చిత్ర బృందం మాత్రం స్పష్టతనివ్వలేదు.

Tags:    

Similar News