ఫైనల్ కాపీ రెడీ..రన్ టైం ఎంతో తెలుసా..?

మహేష్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ చిత్రం మహర్షి ఫైనల్ కాపీ రెడీ అయిందట. రెండు రోజులు కిందట ఫైనల్ కాపీని లాక్ [more]

Update: 2019-04-26 12:47 GMT

మహేష్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ చిత్రం మహర్షి ఫైనల్ కాపీ రెడీ అయిందట. రెండు రోజులు కిందట ఫైనల్ కాపీని లాక్ చేసినట్టు చెబుతున్నారు. మహేష్ – పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా రన్ టైం దాదాపు 170 నిమిషాల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే మూడు గంటలకు పది నిమిషాలు తక్కువ అన్నమాట. వాస్తవానికి ఆమధ్య ఎప్పుడో ఫ్యూటేజ్ నాలుగు గంటలు వచ్చిందన్నారు. కానీ చివరికి మూడు గంటలకు లాక్ చేసారు. అవుట్ పుట్ చూసిన నిర్మాత దిల్ రాజు ఫుల్ హ్యాపీ గా ఉన్నాడట. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారు.

మే 1న ప్రీ రిలీజ్ ఈవెంట్

ఆల్రెడీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ట్రైలర్ వర్క్ కూడా నడుస్తుంది. మే 2న అన్ని థియేటర్స్ లో ఈ ట్రైలర్ ను వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మే 1న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనున్నారు. ఆ తరువాత రోజు నుండి మహేష్ వరుసగా ప్రమోషన్స్ కు దిగుతారు. ఈ సినిమా పబ్లిసిటీ యాక్టివిటీని నమ్రత పీఆర్ టీమ్ డిజైన్ చేస్తున్నట్లు భోగట్టా. ప్రస్తుతం మహేష్ ఫామిలీతో కలిసి పారిస్ కి హాలిడేకి వెళ్లారు. రాగానే మహేష్ బాబు సినిమా ప్రచారానికి దిగుతారు.

Tags:    

Similar News