మహర్షి క్రేజ్ చూసారా..!

Update: 2018-10-17 09:39 GMT

మహేష్ - వంశీ పైడిపల్లి కాంబోలో ముగ్గురు బడా నిర్మాతలు నిర్మిస్తున్న మహర్షి సినిమా షూటింగ్ ఒక రేంజ్ లో అసలు విరామమే లేకుండా జరుగుతుంది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల తర్వాత కొరటాల దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాతో హిట్ కొట్టాడు. వంశీ పైడిపల్లి కూడా ఊపిరి సినిమా హిట్ తో ఉండడంతో... వీరి కాంబో మీద అందరిలో ఆసక్తి, ట్రేడ్ లో క్రేజ్ నెలకొంది.

మహేష్ కెరీర్ లో మైలురాయి

ఏప్రిల్ 2019లో విడుదలయ్యే ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే మైలురాయి అవడం, ముగ్గురు బడా నిర్మాతలు ఈ సినిమాని నిర్మించడంతో దర్శకుడు వంశీ కూడా సినిమాని తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ చిత్రీకరిస్తున్నాడు. అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అరవింద సమేతతో హిట్ అందుకున్న పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

శాటిలైట్ హక్కులు దక్కించుకున్న జెమిని

అయితే ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలతో మహర్షి సినిమా శాటిలైట్ హక్కులకు గట్టిపోటీ ఏర్పడింది. ఫ్యాన్సీ రేటుగా పెద్ద మొత్తం చెల్లించి శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నారు. కానీ ఆ రేటు ఏంటనేది బయటికి రాలేదు గాని ఈ విషయాన్ని జెమిని ఛానల్ అధికారికంగా ధృవీకరించారు. మామూలుగానే మహేష్ సినిమాలు ఫ్లాప్ అయినా ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద మంచి అంచనాలే ఉంటాయి. మరి భరత్ అనే నేను హిట్ అవడంతో ఇప్పుడు ఈ మహర్షి మీద ఆటోమాటిగ్ గా అంచనాలు వచ్చేసాయి.

Similar News