సెంటిమెంట్ అంటూ తప్పుకున్నారు… లేదంటే..?

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి మహర్షి సినిమా ముందుగా ఉగాది కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేద్దామని నిర్మాత దిల్ రాజు చెప్పాడు. అయితే మహర్షి [more]

Update: 2019-04-30 06:27 GMT

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి మహర్షి సినిమా ముందుగా ఉగాది కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేద్దామని నిర్మాత దిల్ రాజు చెప్పాడు. అయితే మహర్షి షూటింగ్ లేట్ కావడంతో… అది కాస్తా ఏప్రిల్ 25కి వాయిదా వేస్తూ దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు. అయినా మహర్షి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నింటికీ ఎక్కువ టైం పట్టేలా ఉందని కామ్ గా గత ఏడాది మహానటి విడుదలైన మే 9న ఫైనల్ గా మహర్షి కి విడుదల డేట్ ఫిక్స్ చేశారు. మహానటి మే 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది కనుక ఆ డేట్ కి వస్తున్నామంటూ సెంటిమెంట్ ఒలకబోశాడు. నిజంగా దిల్ రాజు సెంటిమెంట్ అంటూ చెప్పినప్పికీ ఏప్రిల్ 25 నుండి తమ సినిమాని మే 9కి పోస్ట్ పోన్ చేసి మహేష్ మహర్షి టీం మంచి పని చేసింది.

అవేంజర్స్ హవాలో కొట్టుకుపోయేదే..!

లేదంటే ఏప్రిల్ 26 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ తాకిడికి మహేష్ ఇబ్బంది పడాల్సి వచ్చేది. అసలే 140 కోట్ల బిజినెస్ జరుపుకుని.. భారీగా రంగంలోకి దిగడానికి సిద్ధమవుతుంది మహర్షి. మరి నిజంగా దిల్ రాజు అవెంజర్స్ కి భయపడి పోస్ట్ పోన్ చేసాడా లేదా నిజంగానే సెంటిమెంట్ కి తలొగ్గాడో కానీ.. అవెంజర్స్ ఎండ్ గేమ్ కి బలికాకుండా బయటపడ్డారు. మరి అవెంజర్స్ క్రేజ్ ఎలా ఉందో గత నాలుగు రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అంటే ఫస్ట్ వీకెండ్ కే రూ.8500 కోట్లు కొల్లగొట్టి రికార్డులను సృష్టించడానికి అవెంజర్స్ ఎండ్ గేమ్ రెడీ అవుతుంది. సోమ, మంగళవారాల్లోనూ అవెంజర్స్ ఎండ్ గేమ్ హవా ఇంకా కొనసాగుటంది. మరి అవెంజర్స్ ఎండ్ గేమ్ సునామీలో మహర్షి కొట్టుకుపోకుండా జాగ్రత్తపడిందనే చెప్పాలి.

Tags:    

Similar News