మహానటిలో చూపించిందంతా వాస్తవం కాదా?

Update: 2018-05-16 08:43 GMT

కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమా ఎంత ఘన విజయం సాధించిందో వేరే చెప్పక్కర్లేదు. మహానటి సినిమాలో సావిత్రి గురించి చెప్పిన విషయాలన్నీ పూర్తి వాస్తవాలు. కానీ కొన్ని విషయాలు వాస్తవం కాదని చెబుతుంది సావిత్రి కన్న కూతురు విజయ చాముండేశ్వరి. అసలు సావిత్రి నట జీవితంలో నాగ్ అశ్విన్ అన్ని మంచిగానే చూపించాడని, కానీ నిజ జీవితంలో మాత్రం సావిత్రి చాలా కష్టాలు పడిందని సావిత్రి గారి గురించి జనాలలో అనేక అపోహలున్నాయని, వాటన్నిటికీ తాను మరింత స్పష్టనిస్తానంటోంది. సావిత్రి గారి అవసాన దశలో అనేక కష్టాలు పడిందని, ఆమె నమ్మినవాళ్ళే ఆమెను మోసం చేసారని చెప్పింది.

జెమినీ గణేశన్ కాజేయలేదు...

అయితే సావిత్రి ఎంతగా ఆస్తులు పోగొట్టుకున్నా చనిపోయే సమయానికి తమకు మూడ్నాలుగు ఇళ్లు మిగిలాయని ఆ ఆస్తులతోనే తాను, తన తమ్ముడు స్థిరపడ్డామని విజయ చెప్పారు. తమ తల్లి దివాళా తీసిందనేది పూర్తిగా అవాస్తవం అని ఆమె అంటున్నారు. ఇక ప్రస్తుతం తాను చెన్నైలో ఖరీదైన ప్రాంతంలో 2500 గజాల విలాసవంతమైన ఫ్లాట్‌లో ఉంటున్నానని, అది తన తల్లి చలవే అని ఆమె చెప్పారు. ఇక్కడే నయనతార లాంటి సెలబ్రెటీలు ఉన్నారన్నారు. ఇక తన తమ్ముడు తన వాటాగా వచ్చిన ఆస్తుల్ని అమ్ముకుని అమెరికాకు వెళ్లి సెటిలైపోయాడన్నారు. అలాగే తన తల్లి ఆస్తుల్ని తండ్రి జెమిని గణేశన్ కాజేశాడన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదనేది విజయ చాముండేశ్వరి చెబుతున్న మాట.

వారితో మంచి సంబంధాలున్నాయి...

అలాగే జెమిని గణేశన్ తన తల్లిని బాగా చూసుకున్నారని, జెమిని మొదటి ఇద్దరి భార్యలతో తమకు, తమ తల్లి సావిత్రి గారికి మంచి అనుబంధం ఉందని, ఇప్పటికి వారితో తాము సంబంధాలు కొనసాగిస్తున్నామని ఆవిడ చెబుతున్నారు. ఇక ఐటి అధికారులు, ఇంట్లోని పనివాళ్ళు కూడా బట్టల మూటలు కట్టుకుని తీసుకుపోయినట్టుగా నగలను డబ్బులను తీసుకుపోయారని సావిత్రి గురించిన అనేక నిజాలను చాముండేశ్వరి బయటపెట్టింది.

Similar News