లూసిఫెర్ రీమేక్ లో ఎవరో కానీ..!!

మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫెర్ రీమేక్ ని చిరు హీరోగా సుజిత్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు. అయితే ఆ సినిమా స్క్రిప్ట్ ని సుజిత్ [more]

Update: 2020-07-15 03:22 GMT

మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫెర్ రీమేక్ ని చిరు హీరోగా సుజిత్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు. అయితే ఆ సినిమా స్క్రిప్ట్ ని సుజిత్ ఇప్పటికే చిరు సలహాల మేరకు పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు. ఆచార్య అవ్వగానే చిరు లూసిఫెర్ సెట్స్ మీదకెళుతుంది. అయితే ఈలోపు లూసిఫెర్ రీమేక్ నటించబోయే నటులు విషయమై సోషల్ మీడియా కథలుకథలుగా పేర్లు ప్రచారంలోకొస్తున్నాయి. ఇప్పటికే మలయాళ లూసిఫెర్ లో చేసిన మంజు వారియెర్ పాత్రని సుహాసిని, ఖుష్బూ చేస్తున్నారని అన్నారు. ఇక వివేక్ ఒబెరాయ్ బాబీ పాత్రని జగపతి బాబు చేస్తున్నాడన్నారు.

అయితే మలయాళ రీమేక్లో మోహన్ లాల్ మెయిన్ అయినా.. అందులో పృద్వి రాజ్, మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, అలాగే పృద్వి రాజ్ తమ్ముడు కేరెక్టర్ చేసిన పాత్రలకు తెలుగులో కాస్త పెరుతున్న నటులే నటిస్తారనేది తెలుసు. కానీ వారు ఎవరనేది మీద సోషల్ మీడియాలో రోజుకో పేరు బయటికొస్తుంది. అయితే ఇప్పుడు వివేక్ ఒబెరాయ్ చేసిన బాబీ పాత్ర కోసం వివేక్ నే సంప్రదించగా.. చెయ్యనని మొహమాటం లేకుండా చెపేప్సాడట. వివేక్ ఒబెరాయ్ లూసిఫర్ సినిమాలో మొదట్లో పవర్ ఫుల్ విలన్ లా కనిపించినా.. తర్వాత వివేక్ కేరెక్టర్ కి విలువ లేకిడ్నా పోయింది. సో అందుకే తెలుగు వెర్షన్ చెయ్యనని చెప్పేశాడట. అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం రెహ్మాన్ ని తీసుకున్నారని అంటున్నారు. రెహ్మాన్ కూడా విలన్ కం నెగెటివ్ పాత్రలకి పెట్టింది పేరే. కానీ రెహ్మాన్ అయినా చివరి వరకు ఉంటాడా? లేదా అది కూడా గాసిప్పా అనేది చూడాలి.

Tags:    

Similar News