మెగా పెళ్ళికి స్పెషల్ గెస్ట్స్

నాగబాబు కూతురు నిహారిక వెడ్డింగ్ కి ఇండస్ట్రీలో ప్రముఖులెవరికి ఆహ్వానాలు లేవు. బాలయ్య ఫ్యామిలీ కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ, దగ్గుబాటి ఫ్యామిలీ కానీ ఇలా ఎవ్వరిని [more]

Update: 2020-12-09 07:10 GMT

నాగబాబు కూతురు నిహారిక వెడ్డింగ్ కి ఇండస్ట్రీలో ప్రముఖులెవరికి ఆహ్వానాలు లేవు. బాలయ్య ఫ్యామిలీ కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ, దగ్గుబాటి ఫ్యామిలీ కానీ ఇలా ఎవ్వరిని మెగా ఫ్యామిలీ నిహారిక పెళ్ళికి ఆహ్వానించలేదు. కారణం ఏముంటుంది కరోనా తప్ప. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నిహారిక పెళ్లి కుటుంబ సభ్యులు, చుట్టాల మధ్యన అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 9 అంటే ఈ రోజు రాత్రి నిహారిక పెళ్లి జరగబోతుంది. అయితే ఈ పెళ్లికి ఇండస్ట్రీ వారిని కానీ, పొలిటికల్ లీడర్స్ కి కానీ ఆహ్వానాలు అందలేదు. అయితే పెళ్లి తర్వాత హైదరాబాద్ లో జరగబోయే నిహారిక – చైతన్య ల రిసెప్షన్ ని ఇండస్ట్రీ ప్రముఖులు – రాజకీయనాయకులను పిలిచి గ్రాండ్ గా ఫంక్షన్ చెయ్యబోతున్నట్టుగా టాక్ అయితే ఉంది. మరి ఇండస్ట్రీ నుండి నిహారిక పెళ్ళికి ఎవరు వెళ్లలేదనే విషయం తెలిసిందే.

మరి ఎవరికీ లేని మెగా ఇన్విటేషన్ ఓ ఇద్దరు హీరోయిన్స్ కు మాత్రం అందింది. వారే లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ. ఈ ఇద్దరు హీరోయిన్స్ నిహారిక పెళ్ళిలో కుటుంబ సభ్యుల వలే తెగ సందడి చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ రాజస్థాన్ కి వెళ్లిన రోజే లావణ్య రీతులు కూడా రాజస్థాన్ లో వాలిపోయారు. మరి వాళ్ళిద్దరిని వరుణ్ తేజ్ పిలిచాడో.. లేదంటే నిహారిక ఫ్రెండ్స్ కనక నిహారిక ఇన్వైట్ చేసిందో తెలియదు కానీ.. లావణ్య త్రిపాఠి, రీతూ వర్మలు నిహారిక వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో హడావిడి చేస్తూ సెల్ఫీలు దిగుతూ రచ్చ చేస్తున్నారు. రీతూ వర్మ అల్లు అర్జున్ తో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఏదిఏమైనా ఇండస్ట్రీలో ఎవరికీ ఆహ్వానం లేకపోయినా.. ఈ ఇద్దరు హీరోయిన్స్ కి మాత్రం స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చారన్నమాట.

Tags:    

Similar News