బాలీవుడ్ లక్ష్మి బాంబ్ నిజంగానే పేలింది!!

రాఘవ లారెన్స్ తమిళంలో సూపర్ హిట్ అయిన కాంచన సినిమాని బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా లక్ష్మి బాంబ్ అంటూ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. [more]

Update: 2020-05-30 07:23 GMT

రాఘవ లారెన్స్ తమిళంలో సూపర్ హిట్ అయిన కాంచన సినిమాని బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా లక్ష్మి బాంబ్ అంటూ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అక్షయ కుమర్ లక్ష్మి బాంబ్ నేరుగా ఓటిటి ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది అనేన్యూస్ ఒక్కసారిగా హైలెట్ అయ్యింది. కరోనా లాక్ డౌన్ తో థియేటర్స్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. థియేటర్స్ తెరుచుకున్నప్పటికీ.. ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారంటేనమ్మకం లేక చాలామంది హీరో, దర్శకనిర్మాత్మలు ఓటిటి ప్లాట్ ఫామ్స్ ఇచ్చే ఆఫర్స్ కి టెంప్ట్ అవుతున్నారు. అందులో భాగంగానే అక్షయ్ కుమర్ లక్ష్మి బాంబ్ కూడా ఓటిటిలో నేరుగా విడుదలకాబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్.

కియారా అద్వానీ – అక్షయ్ కుమార్ కాంబోలో రాఘవ లారెన్స్ తెరకెక్కిన లక్ష్మి బాంబ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఓటిటి ప్లేట్ ఫామ్ లో హాట్ స్టార్ లక్ష్మి బాంబ్ సినిమా ఓటీటీ హక్కులను 125 కోట్లకు దక్కించుకున్నట్టుగా లేటెస్ట్ న్యూస్. మాములుగా అయితే ఓటిటి నుండి ఓ 60 నుండి 65 కోట్ల ఆఫర్ ఉండేది. కానీ థియేటర్స్ లో విడుదల కానీ ఈ లక్ష్మి బాంబ్ నేరుగా ఓటిటికి రావడంతో వారు ఈ భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విషయంలో క్లారిటీ లేదు కానీ.. ఓటిటికి హక్కులు అమ్మేసినా.. లక్ష్మి బాంబ్ ఇప్పుడప్పుడే ఓటిటికి వచ్చే ఛాన్స్ లేదంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తి రాలేదు. సో అవన్నీ పూర్తయ్యాక ఈ సినిమాని ప్రేక్షకులు నేరుగా ఓటిటిలో చూడొచ్చు అంటున్నారు

Tags:    

Similar News