బాలయ్య సినిమాలో లేడీ విలన్..!

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ సిరీస్ తరువాత తమిళ దర్శకుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో ఓ పవర్ ఫుల్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ [more]

Update: 2019-05-10 11:57 GMT

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ సిరీస్ తరువాత తమిళ దర్శకుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శక‌త్వంలో ఓ పవర్ ఫుల్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా నుండి వస్తున్న ఫ్రెష్ అప్ డేట్ ఏంటంటే ఇందులో ఇద్దరు విలన్స్ ఉండబోతున్నారని. అది కూడా ఒక లేడీ విలన్ గా ఓ హీరోయిన్ నటించబోతుంది. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఈ చిత్రంలో విలన్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మ‌రోసారి విల‌న్ గా జ‌గ‌ప‌తి బాబు

అలానే జగపతి బాబు కూడా మరోసారి బాలకృష్ణతో విలన్ పాత్ర చేయనున్నాడు. లెజెండ్ తరువాత మళ్లీ వీరి కాంబినేషన్ లో సినిమా కావడం ఇదే. ఇక ప్రముఖ నిర్మాత సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. గతంలో 'జైసింహా' వంటి హిట్ చిత్రాన్ని అందించిన టీంతోనే ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి కూడా చిరంత‌న్ భ‌ట్ సంగీత దర్శకుడు.

Tags:    

Similar News