డిఫరెంట్ టైటిల్ తో కృష్ణ వంశీ

వరుస డిజాస్టర్స్ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ చాలాకాలం అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. నక్షత్రం తర్వాత కొన్నాళ్ళకి కృష్ణవంశీ సినిమా అంటూ ప్రచారం జరిగినా అదేం పట్టాలెక్కలేదు. తాజాగా కృష్ణవంశీ [more]

Update: 2019-10-17 07:08 GMT

వరుస డిజాస్టర్స్ తర్వాత దర్శకుడు కృష్ణవంశీ చాలాకాలం అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. నక్షత్రం తర్వాత కొన్నాళ్ళకి కృష్ణవంశీ సినిమా అంటూ ప్రచారం జరిగినా అదేం పట్టాలెక్కలేదు. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోబోతుందని టాక్. ఇప్పటికే తెరవెనుక కృష్ణవంశీ కొత్త సినిమా పనులు సైలెంట్ గా మొదలయ్యాయని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. కృష్ణ వంశీ కొత్త చిత్రం న‌ట సామ్రాట్‌ అనే మ‌రాఠీ చిత్ర రీమేక్ అని తెలుస్తుంది.

రంగమార్తాండ…

మరాఠీలో సూపర్ హిట్ అయిన న‌ట సామ్రాట్‌ ని తెలుగులో ప్రకాష్ రాజ్ తో రీమేక్ చేయబోతున్నాడట కృష్ణ వంశీ. మరాఠీ న‌ట సామ్రాట్‌ లో నానా పాటేకర్ కీలక పాత్ర చేశాడు. ఇప్పుడు నానా పాత్రని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోషిస్తున్నట్లుగా అలాగే మరో కీలక పాత్రలో రమ్యకృష్ణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ గా కృష్ణవంశీ రంగ మార్తాండ‌ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లుగా సమాచారం. మరి ఈ రంగ మార్తాండ‌ డిఫరెంట్ టైటిల్ తో కృష్ణవంశీ మళ్ళీ ఫామ్ లోకొస్తాడేమో చూడాలి.

 

Tags:    

Similar News