క్రిష్.. జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ కు బ్రేక్ వేస్తున్నాడా?

Update: 2018-05-17 06:51 GMT

తెలుగు సినిమాను ప్రపంచం మొత్తం చూపించిన ఘనత రాజమౌళికే ఉంది. ఆయన తీసిన 'బాహుబలి' సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజై ఘన విజయం సాధించింది. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని పలుమార్లు చెప్పారు. మహాభారతాన్ని సినిమా సిరీస్ గా తీయాలని తన కోరిక అని కాకపోతే ప్రస్తుతం తను అనుకున్న విధంగా టెక్నాలజీ అందుబాటులో లేనందున ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లడంలేదని చెప్పాడు జక్కన్న.

బ్రేకులు వేస్తున్న క్రిష్....

ప్రస్తుతం జక్కన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ తీసే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ రాజమౌళికి ట్విస్ట్ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. క్రిష్ ప్రస్తుతం బాలీవుడ్ లో మణికర్ణికను తీస్తున్నాడు. ఈ సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అయితే అది షూటింగ్ దశలో ఉండగానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్స్ పనులు స్టార్ట్ చేసాడు. పర్వ అనే పేరుతో తన ప్రాజెక్ట్ వర్క్ చేసాడు క్రిష్. పర్వ అంటే కూడా మహాభారతమే.

కన్నడ రచన ఆధారంగా...

భైరప్ప అనే కన్నడ రచయిత రాసిన మహాభారతమే ఈ పర్వ. ఎప్పటినుండో ఈ కథను సినిమాగా తీయాలన్నదే క్రిష్ కల అట. క్రిష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో అతను రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కు బ్రేక్ వేసే అవకాశం ఉంది. అయితే ఇంతవరకు క్రిష్ దీని గురించి అఫీషియల్ గా నోరు విప్పిందే లేదు. మరి మణికర్ణిక సినిమా రిలీజ్ అయ్యాక ఏమైనా చెబుతాడేమో చూద్దాం.

Similar News