‘అంతరిక్షం’కి క్రిష్ తోనే సమస్య ..?

Update: 2018-12-04 06:43 GMT

ఈ నెల 21న వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'అంతరిక్షం' విడుదల అవ్వబోతుంది. 'ఘాజి' చిత్రంతో ఇండియా మొత్తం ఫేమస్ అయిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. మరో రెండు వారాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని డేట్ ప్రకటించినా ఇంతవరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ లుక్, టీజర్, పోస్టర్స్, ఒక సాంగ్ తప్ప ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ తాలూకు సందడి కనిపించడం లేదు. ప్రమోషన్స్ లేట్ అవ్వడానికి ముఖ్య కారణం నిర్మాతల్లో ముఖ్యుడైన క్రిష్ అని తెలుస్తోంది.

క్రిష్ బిజీగా ఉండటంతోనే...

క్రిష్ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే నెల సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. అందుకే 'అంతరిక్షం' పై ఫోకస్ చేయలేకపోతున్నాడని సమాచారం. మరోవైపు అదే రోజు డిసెంబర్ 21న శర్వానంద్ -సాయి పల్లవిల 'పడి పడి లేచే మనసు' విడుదల అవుతుంది. ఈ సినిమా 'అంతరిక్షం' కన్నా ముందు ఉంది. ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోయినా రిలీజైన ఆడియో ట్రాక్స్, పోస్టర్స్ అన్ని కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.

ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తేనే...

మరి 'అంతరిక్షం' ఇంకా హడావిడి ఎందుకు స్టార్ట్ చేయలేదో అర్ధం కావట్లేదు. క్రిష్ ఒక్క రోజు ఎన్టీఆర్ బయోపిక్ నుండి బయటికి వచ్చి ఈ సినిమా ప్రమోషన్స్ కి అటెండ్ అయితే అంతా సెట్ అయిపోతాయి. కానీ ఆలా చేయట్లేదు. 'పడి పడి లేచే మనసు' తో పోలిస్తే 'అంతరిక్షం' పై హోప్స్ తక్కువగా ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రమోషన్స్ కరెక్ట్ గా చేస్తేనే వర్క్ అవుట్ అవుతుంది. లేకపోతే కష్టమే అంటున్నారు. పైగా ఈ సినిమా స్పేస్ కి సంబంధించి కాబట్టి మనోళ్లు త్వరగా కనెక్ట్ కారు. కాబట్టి ఎంత త్వరగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే అంత మంచిది అంటున్నారు.

Similar News