కొరటాలకు పారితోషకం ఇవ్వని నిర్మాత

Update: 2018-07-16 06:47 GMT

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా 2018లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో మంచి వసూళ్లు సాధించిన చిత్రం. డీవీవీ దానయ్య నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం సుమారు 200 కోట్ల బిజినెస్ చేసిందని అంచనా. అయితే, ఇంత భారీ విజయం సాధించినా, వసూళ్లు కూడా బాగా జరిగినా చిత్ర దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ కైరా అద్వానీకి ఇంకా పారితోషకం పూర్తిగా ఇవ్వలేదట నిర్మాత.

పారితోషకం ఇవ్వకుండానే .....

తన పారితోషకం చెల్లించాలని కొరటాల శివ ఎన్నిసార్లు అడిగినా సదరు నిర్మాత నుంచి స్పందన లేదంట. అయితే, దానయ్యతో మరో సినిమా చేయాల్సి ఉన్నందున కొరటాల గట్టిగా అడగలేకపోతున్నారని తెలుస్తోంది. ఇక కైరా అద్వానీకి కూడా భరత్ అనే నేను సినిమా పారితోషకం పూర్తిగా అందకముందే బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ తో డీవీవీ నిర్మిస్తున్న చిత్రానికి సైన్ చేసింది. దీంతో తన పారితోషకం వస్తుందనే ఆశతో ఉందట. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ తో మల్టీస్టారర్ సినిమా కూడా నిర్మిస్తున్నారు దానయ్య. అయితే, పారితోషకం విషయంలో దానయ్య ఇలానే వ్యవహరిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

Similar News