కొరటాల అలా చేసాడంటే…!!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే.. కరోనా తో పూర్తి సంక్షోభంలో పడింది. గతంలోలా భారీ బడ్జెట్ చిత్రాలు ఉండేలా కనిపించడం లేదు. హీరోలకు భారీ [more]

Update: 2020-07-24 08:45 GMT

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే.. కరోనా తో పూర్తి సంక్షోభంలో పడింది. గతంలోలా భారీ బడ్జెట్ చిత్రాలు ఉండేలా కనిపించడం లేదు. హీరోలకు భారీ పారితోషకాలు ఇచ్చేలా లేదు. నిర్మాతలంతా ప్రస్తుతం ఘొల్లుమంటున్నారు. కారణం తాము చేసే సినిమాలు చాలా సెట్స్ మీద ఆగిపోవడంతో అప్పుల బాధ పెరిగిపోతుంది. అందుకే సినిమాల బడ్జెట్ లోనే కాదు, హీరోలు, దర్శకులు తమ పారితోషకాలను తగ్గించుకోవాలని రాజమౌళి లాంటి దర్శకులే సూచించారు. కానీ ఏ ఒక్క హీరో ఇంతవరకు ముందుకొచ్చి పారితోషకం తగ్గించుకున్నామని చెప్పలేదు.

కానీ పరశురామ్, కీర్తి సురేష్ లు తమ పారితోషకాల్లో కొంతమొత్తం తగ్గించుకున్నారనే టాక్ ఉంది. కానీ క్లారిటీ లేదు. అయితేగా సమాజం గురించి ఆలోచిస్తూ సినిమాలు తియ్యడమే కాకుండా.. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటూ కరోనా పై సమాజానికి అర్ధమయ్యేలా చెబుతున్న కొరటాల శివ ఇప్ప్పుడు తన పారితోషకంలో కోత పెట్టుకున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం చిరుతో కొరటాల ఆచార్య సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆచార్య సినిమాని కొరటాల చాలా ఎక్కువ మొత్తంలోనే పారితోషకం అందుకోబోతున్నాడు. కానీ తాజాగా కొరటాల శివ స్వచ్ఛందంగా తన పారితోషకాన్ని తగ్గించుకున్నాడని తెలుస్తుంది. ముందు అనుకున్న పారితోషకం కన్నా తక్కువ ఇవ్వండి అంటూ కొరతలు ఆచార్య నిర్మాతలైన రామ్ చరణ్ టీం కి చెప్పినట్టుగా ఫిల్మ్నగర్ టాక్.

Tags:    

Similar News