కొరటాల కి ప్లానింగ్ లేదా?

చిరు సైర సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అయితే చిరు సైరా నరసింహారెడ్డి తర్వాత మరో పాన్ ఇండియా మూవీ నే చేస్తాడు [more]

Update: 2020-04-14 08:56 GMT

చిరు సైర సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అయితే చిరు సైరా నరసింహారెడ్డి తర్వాత మరో పాన్ ఇండియా మూవీ నే చేస్తాడు అనుకుంటే… కొరటాల తో ఆచార్య సినిమా చేస్తున్నాడు. కొరటాల గనక పాన్ ఇండియా మూవీ కథతో చిరు దగ్గరికి వెళ్లుంటే చిరు ఖచ్చితంగా భారీ బడ్జెట్ తో ఆచార్య చేసేవాడే. కానీ కొరటాల జస్ట్ తెలుగు ప్రేక్షకులు మాత్రం మెచ్చేలా కథ రాసుకున్నాడు.ఇప్పుడు చూస్తే సుకుమర్ నుండి పూరి వరకు పాన్ ఇండియా లెవల్ కి వెళ్లిపోయారు.

మరి కొరటాల శివ పక్క ప్లాన్ తో పాన్ ఇండియా కి వర్కౌట్ అయ్యే కథ తెస్తే రామ్ చరణ్ ఈ సినిమాని భారీగా మొదలెట్టేవాడే. అలాగే ప్రమోషన్స్ ని భారీగా చేసి చిరు తో మరో పాన్ ఇండియా ఫిలిం ని నిర్మించేవాడు. కానీ కొరటాల సరైన ప్లాన్ లేకుండా ఆచార్య మొదలెట్టాడని మెగా ఫాన్స్ ఫీలవుతున్నారు. మరి ఆచార్య స్క్రిప్ట్ మీద కొరటాల ఏడాదిపైనే కూర్చున్నాడు… కానీ పాన్ ఇండియా కథగా మర్చలేకపోయాడంటున్నారు. ఇక కొరటాల మాత్రం సుక్కు బాటలో తన అసిస్టెంట్స్ ని ప్రోత్సహిస్తూ నిర్మాతగా మారాడని టాక్ వినబడినా ఆ సినిమా పట్టాలెక్కలేదు.. తన దర్శకత్వ శాఖలో పనిచేసే ఓ లేడి ని డైరెక్టర్ ని చేస్తూ కథ, మాటలు, నిర్మాణం కూడా కొరటాలా ఇవ్వబోతున్నాడట.

Tags:    

Similar News