జస్ట్ గెస్ట్ రోల్ కి ఓకె చెప్పిందా?

కియారా అద్వానీ కబీర్ సింగ్ సినిమా తర్వాత బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. హాట్ అందాలతో అదరగొడుతున్న కియారా టాలీవుడ్ లో సక్సెస్ [more]

Update: 2020-08-16 06:48 GMT

కియారా అద్వానీ కబీర్ సింగ్ సినిమా తర్వాత బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. హాట్ అందాలతో అదరగొడుతున్న కియారా టాలీవుడ్ లో సక్సెస్ కాలేదు కానీ… బాలీవుడ్ సూపర్ సక్సెస్ అయ్యింది. బాలీవుడ్ లో ఇప్పుడు కియారా ఫుల్ బిజీగా ఉన్న తార. అందుకే తెలుగునుండి అమ్మడుకి ఆఫర్స్ వెళుతున్నప్పటికీ.. కియారా డేట్స్ ఖాళీ లేవంటూ చెప్పేస్తుంది. సౌత్ సినిమాలకొచ్చేసరికి కియారా ఆవిడకి డేట్స్ ప్రాబ్లెమ్ వచ్చేస్తుంది. మహేష్ సర్కారు వారి పాట ఆఫర్ ముందు కియారకే వచ్చినట్టుగా చెప్పారు. కానీ కియారా మాత్రం మహేష్ ఆఫర్ కే నో చెప్పినట్టుగా వార్తలొచ్చాయి.

మరి అంత బిజీ తార ఇప్పుడు జస్ట్ గెస్ట్ రోల్ కి ఓకె చెప్పిందట. అది కూడా ఓ వెబ్ సీరీస్ లో గెస్ట్ రోల్ చెయ్యబోతుందట. బాలీవుడ్ లో ఫ్యాషన్ డిజైనర్ మాసాబ్ గుప్త జీవిత కథ ఆధారంగా… మసబా మసబా వెబ్ సీరీస్ తెరకెక్కబోతుంది. ఆ వెబ్ సీరీస్ లో కియారా అద్వాని గెస్ట్ రోల్ చెయ్యబోతుందట. ఈ వెబ్ సీరీస్ లో కియారా అద్వానీ సినిమా హీరోయిన్ కేరెక్టర్ లో తళుక్కుమనబోతుందట. హీరోయిన్ గా మాసాబ్ స్టోర్స్ కి వెళ్లి ఓ డ్రెస్ కొనుగోలు చేసే సీన్ లో కియారా నటించబోతుందట. అయితే ఈ వెబ్ సీరీస్ నిర్మాత అశ్విని తనని వెబ్ సీరీస్ లో గెస్ట్ రోల్ చెయ్యమని అడగగానే కియారా ఒప్పేసుకుంది. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుందట.

Tags:    

Similar News