మళ్ళీ ఆ భామనా?

వంశి పైడిపల్లి – మహేష్ కాంబోలో తెరకెక్కబోయే రెండో సినిమా విశేషాలు అప్పుడే మొదలైపోయాయి. ఇప్పటికే స్టోరీ లైన్ ఓకె చేయించుకుని పూర్తి స్క్రిప్ట్ తో ప్రిపేర్ [more]

Update: 2020-01-24 06:00 GMT

వంశి పైడిపల్లి – మహేష్ కాంబోలో తెరకెక్కబోయే రెండో సినిమా విశేషాలు అప్పుడే మొదలైపోయాయి. ఇప్పటికే స్టోరీ లైన్ ఓకె చేయించుకుని పూర్తి స్క్రిప్ట్ తో ప్రిపేర్ అవుతున్న వంశి పైడిపల్లి కి మహేష్ మూడు నెలలు టైం పెట్టాడు. ఈలోపు స్క్రిప్ట్ తో పాటుగా నటీనటుల ఎంపిక చేపట్టమని.. ఎందుకంటే సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ బాబు మూడు నెలల భారీ గ్యాప్ తీసుకుంటానని చెప్పాడు కనక. అయితే ఈలోపు వంశి పైడిపల్లి మ్యూజిక్ సిట్టింగ్ నుండి నటుల ఎంపిక చెప్పట్టడానికి రెడీ అవుతున్నాడు.

అయితే భరత్ అనే నేను సినిమాలో మహేష్ కి జోడి గా చేసి.. రామ్ చరణ్ తో కలిసి ప్లాప్ కొట్టిన కియారా అద్వానీ పేరు మహేష్ పక్కన హీరోయిన్ గా పరిశీలిస్తున్నారనే టాక్ వినబడుతుంది. మహేష్ వైఫ్ నమ్రత కూడా కియారా పేరునే సూచించినట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే బాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ మీదున్న కియారా అయితే మహేష్ సినిమా కి మరింత క్రేజ్ పెరుగుతుందని.. నమ్రత ఇలా అలోచించి కియారా అద్వానీ పేరుని సూచించినట్లుగా చెబుతున్నారు. మరి వీళ్ళు అనుకోవడమేమో గాని.. కియారా ఖాళీ ఉండాలిగా… ఎందుకంటే బాలీవుడ్ సినిమాల్తో కియారా డైరీ ఫుల్ గనక. మహేష్ సినిమాకి నో చెబుతుందో? లేదంటే తనకి అచ్చొచ్చిన హీరో అని ఎస్ చెబుతుందో? చూడాలి.

Tags:    

Similar News