చెర్రీ హీరోయిన్ వరుణ్ తేజ్ సరసన?

వాల్మీకి హిట్ తో ఉన్న వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో మొదలు పెట్టబోతున్నాడు. వాల్మీకి హిట్ తర్వాత వరుణ్ క్రేజ్ [more]

Update: 2019-11-02 04:14 GMT

వాల్మీకి హిట్ తో ఉన్న వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో మొదలు పెట్టబోతున్నాడు. వాల్మీకి హిట్ తర్వాత వరుణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం కోసం చరణ్ హీరోయిన్ ని సంప్రదిస్తున్నట్లుగా న్యూస్. రామ్ చరణ్ తో వినయ విధేయరామ లో నటించిన కియారా అద్వానీ ని వరుణ్ తదుపరి చిత్రం కోసం సంప్రదిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవడ్ టాప్ రేంజ్ హీరోయిన్. వరస సినిమాలతో బాగా బిజీ అయిన కియారా అద్వానీ, వరుణ్ ప్రపోజ్ ఒప్పుకుంటుందో.. లేదో.. అని ఇప్పుడు వరుణ్ టీం ఎదురు చూస్తుంది.

టాలీవుడ్ లో కియారా కి సినిమాలు చెయ్యాలని ఉన్నప్పటికీ.. బాలీవుడ్ లో క్రేజీ సినిమాల్తో డైరీ ఫుల్ అయిన కియారా అద్వానీ డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని వరుణ్ కోసం ఆలోచిస్తానని మాటిచ్చినట్లుగా ఫిలింనగర్ టాక్. మరి బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న కియారా అద్వానీ తెలుగులో మీడియం రేంజ్ హీరో వరుణ్ తేజ్ పక్కన నటించాలంటే… ఎంత డిమాండ్ చేస్తుందో.. నిర్మాతలు ఎంత సమర్పించాల్సి ఉంటుందో అంటున్నారు. అయితే కియారా డిమాండ్ ని క్రేజ్ ని బట్టి అడిగింది ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడరని.. ఆ నమ్మకంతోనే కియారని సంప్రదించారని అంటున్నారు

Tags:    

Similar News