కెజిఎఫ్ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమానా?

ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా మారుమోగిపోతున్న పేరు ‘కెజిఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు. విడుదల అయిన అన్ని చోట్లా ఈసినిమాకు మంచి [more]

Update: 2018-12-27 06:39 GMT

ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా మారుమోగిపోతున్న పేరు ‘కెజిఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు. విడుదల అయిన అన్ని చోట్లా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో మంచి వసూల్ తో దూసుకుపోతుంది. కన్నడలో అయితే ఈ స్థాయిని మించిన సినిమా రాలేదు. దాంతో ఈమూవీ అక్కడ ఇండస్ట్రీ హిట్ అయింది. మొదటి పార్ట్ తరువాత రెండు పార్టు కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.

డిస్కషన్స్ లో….

అయితే ఈసినిమా తరువాత ప్రశాంత్ నీల్ ఇంకా తన తదుపరి సినిమాని అనౌన్స్ చేయలేదు. తాజా సమాచారం ప్రకారం తెలుగు లో యువి సంస్థ ప్రభాస్ తో ఓ సినిమా చేసేందుకు అతనితో డిస్కషన్స్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈసినిమా తరువాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇది కూడా యువి లోనే నిర్మితం అవుతుంది.

భారీ ఆఫర్లు….

ఈరెండు సినిమాలు 2020 సంక్రాంతి లోపు వచ్చేస్తాయి. తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. అయితే ప్రశాంత్ మాత్రం ప్రస్తుతం ఏ సినిమా గురించి ఆలోచినట్లేదని ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ‘కెజిఎఫ్’ చాప్టర్ టూ పైనే ఉందని చెప్పాడట. అయితే ఈ దర్శకుడికి కర్ణాటకలో కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. సిఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ తో సినిమా కోసం ప్రశాంత్ కు భారీ మొత్తం లో అడ్వాన్స్ ఇచ్చారని అక్కడ మీడియా టాక్. మరి ప్రశాంత్ ఏం చేస్తాడో చూడాలి. ‘కెజిఎఫ్’ చాప్టర్ 1 కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కాబట్టి చాప్టర్ 2 కోసం భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి అది ఎంతవరకు ఆకట్టుకుంటదో చూడాలి.

Tags:    

Similar News