చిరు చెల్లిగా మహానటినా?

చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు. చిరు ఎప్పుడొస్తాడో అని కొరటాల వెయిటింగ్. అయితే చిరు ఆచార్య తర్వాత మెహెర్ రమేష్ తో తమిళ వేదాళం [more]

Update: 2020-10-17 06:16 GMT

చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ ఇంకా మొదలవలేదు. చిరు ఎప్పుడొస్తాడో అని కొరటాల వెయిటింగ్. అయితే చిరు ఆచార్య తర్వాత మెహెర్ రమేష్ తో తమిళ వేదాళం రీమేక్ చేయబోతున్నాడు. ఇప్పటికే వేదాళం రీమేక్ స్క్రిప్ట్ పూర్తయ్యింది అని… చిరు అందులో మార్పులేమి చెప్పలేదని, కానీ బడ్జెట్ తగ్గించి సినిమా చెయ్యమని మాత్రం మేహేర్ కి సలహా ఇచ్చాడనే న్యూస్ నడుస్తుంది. అయితే ఈ వేదాళం రీమేక్ కోసం చిరంజీవి గుండు తో ఫోటో షూట్ కూడా చేయించుకున్నాడు. ఇక ఈ రీమేక్ లో చిరు కి చెల్లెలిగా సాయి పల్లవి నటించబోతుంది అనే న్యూస్ నడిచింది. అయితే యూనిట్ నుండి కానీ, సాయి పల్లవి నుండి కానీ స్పష్టత రాలేదు. హీరోయిన్ గా పీక్స్ లో ఉన్న సాయి పల్లవి చిరుకి చెల్లిగా ఒప్పుకుంటుందా అన్నారు.

కానీ సాయి పల్లవి కేరెక్టర్ బావుంది అంటే ఒప్పేసుకుంటుంది… అని తెలిసిన విషయం కావడంతో అందరూ నమ్మారు. అయితే తాజాగా సాయి పల్లవి చిరు కి సోదరిగా వేదాళం రీమేక్ లో నటించడమనేది కేవలం రూమర్ అని, అసలు తనపై వస్తున్న ప్రచారానికి తెర దించాలని సాయి పల్లవి కూడా అనుకోలేదట. కారణం అలాంటి న్యూస్ పై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని సన్నహితుల దగ్గర చెప్పినట్లుగా తెలుస్తుంది. మరో పక్క సాయి పల్లవి ని అనుకున్న కేరెక్టర్ లోకి ఇప్పుడు కీర్తి సురేష్ ని దింపుతున్నారు. అంటే చిరు సోదరి పాత్ర కోసం మహానటిని రామ్ చరణ్ అండ్ టీం సంప్రదించింది అంటున్నారు. మరి ఇది కూడా నిజమని నమ్మలేం ఎందుకంటే.. కీర్తి సురేష్ ప్రస్తుతం స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ మూవీస్ చేస్తున్న టైం లో చిరు కి సోదరిగా అంటే ఒప్పుకోకపోవచ్చు అంటున్నారు. సో ఇది కూడా ఫేక్ న్యూస్ అవుతుంది.

Tags:    

Similar News