కీర్తి ఒక్కసారిగా లైన్ లో కొచ్చేసిందా?

మహానటి ఫేమ్ ని సరిగ్గా వాడుకోలేకపోయిన కీర్తి సురేష్ ప్రస్తుతం అయితే చేతినిండా సినిమాలతో కళకళలాడుతుంది. ఆఖరుకి బాలీవుడ్ లో కూడా కాలు పెట్టింది. కానీ అక్కడ [more]

Update: 2020-02-27 05:16 GMT

మహానటి ఫేమ్ ని సరిగ్గా వాడుకోలేకపోయిన కీర్తి సురేష్ ప్రస్తుతం అయితే చేతినిండా సినిమాలతో కళకళలాడుతుంది. ఆఖరుకి బాలీవుడ్ లో కూడా కాలు పెట్టింది. కానీ అక్కడ వర్కౌట్ అవ్వక మళ్ళీ తెలుగు, తమిళ సినిమాలతో బిజీ అయ్యింది. తెలుగు, తమిళ సినిమాల్తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ కి వరస ఆఫర్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా కీర్తి సురేష్ ని దర్శకుడు క్రిష్.. పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా కోసం హీరోయిన్ గా సెలెక్ట్ చేసాడనే న్యూస్ నడుస్తుంది. ఇప్పటికే అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ కీర్తి సురేష్ తో జోడిగా నటించాడు. మరి క్రిష్ కూడా కీర్తినే అనుకుంటే పవన్ తో కీర్తి రెండో సినిమా చేస్తుంది.

మరో పక్క దర్శకుడు తేజ అలివేలు మంగ – వేంక‌ట‌ర‌మ‌ణ‌ సినిమా కోసం కీర్తి సురేష్ ను హీరోయిన్ గా సంప్రదిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. గోపిచంద్ తో తేజ చెయ్యబోయే అల‌మేలు మంగ – వేంక‌ట‌ర‌మ‌ణ‌ సినిమా లో హీరోయిన్ గా ముందు కాజల్ అగర్వాల్ అనుకున్నప్పటికీ.. .. తేజ తాజాగా అనుష్క అయినా కీర్తి సురేష్ అయినా బావుంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట. అనుష్క ఎటూ సినిమాలు ఒప్పుకోవడం లేదు. అందుకే కీర్తి సురేష్ ని అలివేలు మంగ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్. అసలు అనుష్క అయితే అలివేలు మంగ గా పర్ఫెక్ట్.. బట్ అనుష్క సానుకూలంగా స్పందిస్తుందో లేదో అని ముందే కీర్తి తో తేజ సంప్రదింపులకు దిగాడట.

Tags:    

Similar News