కీర్తి… నీ సపోర్ట్ ఉంటే చాలు!!

కీర్తి సురేష్ మహానటి తర్వాత నటించిన సినిమాలు సక్సెస్ కాకపోయినా.. లేడి ఓరియెంటెడ్ మూవీస్ తోనూ, స్టార్ హీరోల అవకాశాలతోను బాగా బిజీగా ఉంది. తాజాగా కీర్తి [more]

Update: 2020-07-09 15:46 GMT

కీర్తి సురేష్ మహానటి తర్వాత నటించిన సినిమాలు సక్సెస్ కాకపోయినా.. లేడి ఓరియెంటెడ్ మూవీస్ తోనూ, స్టార్ హీరోల అవకాశాలతోను బాగా బిజీగా ఉంది. తాజాగా కీర్తి సురేష్ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ పెంగ్విన్ ఓటిటి లో విడుదలైంది. అలాగే కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా ఒకటి, మరొకటి గుడ్ ల‌క్ స‌ఖీ సినిమా షూటింగ్స్ పూర్తయ్యి విడుదల కోసం వెయిట్ చేస్తున్నాయి. అయితే తాజాగా కీర్తి సురేష్ మహేష్ బాబు సర్కారు వారి పాట లో హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఆ సినిమా కరోనా తగ్గి పట్టాలెక్కడం తరువాయి… కీర్తి మహేష్ తో జాయిన్ అవుతుంది. అయితే కీర్తి సురేష్ నటించిన రెండు సినిమాలు ఇప్పుడు ఓటిటి బాట పట్టబోతున్నట్లుగా ఫిల్మ్నగర్ టాక్.

ఇంతకుముందు పెంగ్విన్ నిర్మాతలు కీర్తి సురేష్ ని సంప్రదించి ఓటిటి లో విడుదల చేసారు. వడ్డీలు కట్టలేక అప్పులైపోతున్నామని కీర్తి ని సంప్రదించగా కీర్తి సురేష్ ఓటిటి లో విడుదలకు ఒప్పుకుంది. తాజాగా గుడ్ ల‌క్ స‌ఖీ నిర్మాతలు, మిస్ ఇండియా నిర్మాతలు కూడా కీర్తి సురేష్ ని ఒప్పించి ఓటిటి లో విడుదల చేస్తే బావుంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. ఇంతకుముందు పెంగ్విన్ అప్పుడే నా సినిమాల్నీ ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి ప్రస్తుతం ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కీర్తి  చెప్పడంతో.. మిస్ ఇండియా నిర్మాతలు ఇప్పుడు ఆ సినిమాలను ఓటిటి కి అమ్మెయ్యడానికి చర్చలు మొదలెట్టిన ట్టుగా టాక్. పెంగ్విన్ అనుకున్నా హిట్ అవాక్కపోయిన.. కీర్తి సురేష్ క్రేజ్ తో ఆ సినిమాలకు మంచి ధర పలికే అవకాశం ఉంది అంటున్నారు.

Tags:    

Similar News