మన్మధుడు కోసం మహానటి..?

నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వెన్నెల కిషోర్ కమెడియన్ గా సమంత గెస్ట్ రోల్ ప్లే చేస్తున్న మన్మధుడు 2 సినిమా షూటింగ్ [more]

Update: 2019-05-07 07:19 GMT

నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వెన్నెల కిషోర్ కమెడియన్ గా సమంత గెస్ట్ రోల్ ప్లే చేస్తున్న మన్మధుడు 2 సినిమా షూటింగ్ ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పరిగెత్తిస్తున్నాడు. పోర్చుగల్ పరిసర ప్రాంతాల్లో మన్మధుడు 2 మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్న రాహుల్ రవీంద్రన్.. ఒక గెస్ట్ రోల్ కోసం సమంతని తీసుకున్నాడనే విషయం తెలిసిందే. అయితే మొదటి మన్మధుడు సినిమాలో వలే ఇద్దరు హీరోయిన్స్ ఈ మన్మధుడు 2లో కూడా ఉండబోతున్నారట. మన్మధుడులో అన్షు, సోనాలి బింద్రే హీరోయిన్స్. దానికి సీక్వెల్ అంటే ఈ మన్మధుడు 2లో కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సిందే. అయితే మధ్యలో సమంత మన్మధుడులో నటిస్తుంది అనేసరికి సమంత సెకండ్ హీరోయిన్ అనుకున్నారు.

కీర్తి సురేష్ ను సంప్ర‌దించిన టీం

కానీ తాజాగా మన్మధుడు 2 కోసం మరో హీరోయిన్ అవసరం ఉంటుందట. ఆ హీరోయిన్ అన్వేషణ జరుగుతుందని.. ఆ హీరోయిన్ కోసమే చాలామందిని అనుకున్నారట కానీ మహానటి సావిత్రి పాత్రలో ఇరగదీసిన కీర్తి సురేష్ అయితే నాగార్జున కి సెట్ అవుతుందని.. ఆమెని సంప్రదించిందట మన్మధుడు టీం. అయితే ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల‌తో ఖాళీ లేని కీర్తి సురేష్ డేట్స్ సర్దుబాటు అయితే తప్పకుండా మన్మధుడు 2లో నటిస్తుందని చిత్ర బృందమే చెబుతుంది. ఇక కీర్తి సురేష్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం మన్మధుడు టీం ఎదురు చూస్తుందట. మరి కీర్తి సురేష్ కాల్షీట్స్ సర్దుబాటు చేసుకోగలిగితే.. మన్మధుడు 2లో నాగ్ సరసన కీర్తి సురేష్ ని చూడొచ్చన్నమాట.

Tags:    

Similar News