కీర్తి సురేష్ మనసులో మాట..!

Update: 2018-10-22 07:21 GMT

నటి కీర్తి సురేష్ 'మహానటి' సినిమాలో సావిత్రి పాత్ర పోషించి ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది. ఆమె నటనకు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ కూడా షాక్ అయింది. దాంతో ఆమె వరస సినిమాలతో బిజీ అయిపోయింది. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. తనకు డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యం ఉందని.. ఎప్పుడూ కథలు, కథనాలు గురించి ఎక్కువ ఆలోచిస్తానని చెప్పింది.

ఎప్పటికయినా డైరెక్టర్ అవుతా...

కుదిరినప్పుడల్లా నేను డైరెక్ట్ చేయబోయే సినిమా కోసం స్టోరీస్ రాసుకుంటుంటానని చెప్పుకొచ్చింది. ఫ్యూచర్ లో కచ్చితంగా డైరెక్టర్ అవుతానని కీర్తీ స్పష్టంగా చెప్పడం విశేషం.ఇక లేటెస్ట్ గా ఆమె తమిళంలో లింగుస్వామి డైరెక్షన్ లో విశాల్ తో కలిసి ‘పందెంకోడి 2’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించింది. తెలుగులో కన్నా తమిళంలో ఈ సినిమాకు మంచి టాక్ లభించింది. ఇందులో కీర్తి నటనకు చాలామంది ఫిదా అయ్యారు.

Similar News