ఆ వార్తలు చూసి కీర్తి సురేష్ నవ్వుకుందట..!

మహానటి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన నటి కీర్తి సురేష్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి [more]

Update: 2019-01-31 07:33 GMT

మహానటి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన నటి కీర్తి సురేష్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి అవకాశాలని దక్కించుకుంటూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటూ క్రేజీ కథానాయికగా పేరు తెచ్చుకుంది. మహానటికి ముందు కీర్తి సురేష్ రెండు కోట్లు డిమాండ్ చేసింది. మహానటి తర్వాత పారితోషికం పెంచడంతో పాటు దర్శక నిర్మాతలకు కొత్త డిమాండ్లు పెడుతోందట. తాను నటించే సినిమాల్లో తప్పకుండ తన బామ్మాకి కూడా ఏదో ఒక పాత్ర ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపధ్యంలో రీసెంట్ గా ఆమె దీనిపై క్లారిటీ ఇచ్చింది.

ఫ్యామిలీ అంతా నవ్వుకున్నాం…

‘‘మా బామ్మా కోసం నేను దర్శక నిర్మాతలని ఇబ్బంది పెడుతున్నానని వస్తున్న వార్తలు చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. మా బామ్మాకు అవకాశాలు ఇవ్వమని నేను ఎప్పుడు ఎవరినీ అడగలేదు. ఎందుకంటే ఆమె నాలా ఫుల్ టైం యాక్టర్ కాదు. ఆమెపై వస్తున్న వార్తలు చూసి మా ఫ్యామిలీ అంతా పగలబడి నవ్వుతున్నారు“ అని చెప్పింది. కీర్తి ప్రస్తుతం ప్రియదర్శన్ రూపొందిస్తున్న భారీ పీరియాడికల్ చిత్రం 'మరక్కార్- అరవిక్కడలంటే సింహం'లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా మరే సినిమాకి సంతకం చేయలేదు.

Tags:    

Similar News