మహేష్ కి అలా ఉపయోగపడతావా కీర్తి..!!

మహేష్ బాబు – పరశురామ్ కాంబోలో తెరెకెక్కబోయే సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ఎంపికైంది. ఈ విషయం మూవీ యూనిట్ [more]

Update: 2020-07-08 05:40 GMT

మహేష్ బాబు – పరశురామ్ కాంబోలో తెరెకెక్కబోయే సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ఎంపికైంది. ఈ విషయం మూవీ యూనిట్ నుండి క్లారిటీ రాకపోయినా.. కీర్తి సురేష్ మాత్రం కన్ఫర్మ్ చేసింది. అయితే మహేష్ సరసన మొదటసారి నటించబోయే కీర్తి సురేష్ రోల్ పై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియా కథనం ప్రకారం ఈ సినిమా మొత్తం బ్యాంకింగ్ రంగంలో జరిగిన అతి పెద్ద స్కాం చుట్టూ తిరగబోతుంది అని… మహేష్ ఈ సినిమాలో బ్యాంకు మేనేజర్ కొడుకు పాత్రలో నటించబోతున్నాడని టాక్ ఉంది. బ్యాంక్ లో జరిగిన అతి పెద్ద స్కామ్ ని బయటపెట్టడం అనేది హీరోకి పెద్ద సవాల్ తో కూడుకున్న పని అని.. దానిని పరశురామ్ కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్ని కలిపి ఆ ఎపిసోడ్ ని హైలెట్ అయ్యేలా రాసుకు న్నాడనీ అంటున్నారు.

అయితే ఇప్పుడు కీర్తి సురేష్ రోల్ పై కూడా ఓ న్యూస్ ప్రచారంలోకొచ్చింది. అదేమిటంటే కీర్తి సురేష్ ఈ సినిమాలో బ్యాంక్ ఎంప్లొయ్ గా నటిస్తుంది అని.. మొదట్లో మహేష్ చేసే పనులు నచ్చకపోయినా.. ఒకొనొక క్షణంలో మహేష్ ని చూసి ఇంప్రెస్స్ అవడమే కాదు… మహేష్ కి బ్యాంక్ స్కామ్ ని సాల్వ్  చెయ్యడానికి హెల్ప్ కూడా చేస్తుందట.  మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. కీర్తి సురేష్ సర్కారు వారి పాటలో ఇలాంటి రోల్ లోనే నటించబోతుంది అంటూ సోషల్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్. 

Tags:    

Similar News