రెండే రెండు కోట్లతో… కోట్లు కొల్లగొట్టేస్తున్నారు

కీరవాణి కొడుకుల పేర్లు ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నానుతున్న పేర్లు. కాల భైరవ, శ్రీ సింహ చిన్న సినిమా మత్తువదలరా తో చితకొట్టేశారు. మత్తువదలరా [more]

Update: 2019-12-29 15:02 GMT

కీరవాణి కొడుకుల పేర్లు ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నానుతున్న పేర్లు. కాల భైరవ, శ్రీ సింహ చిన్న సినిమా మత్తువదలరా తో చితకొట్టేశారు. మత్తువదలరా అంటూ అందరిని మత్తులోకి దించేశారు. మైత్రి మూవీస్ లో తెరకెక్కిన మత్తువదలరా సినిమా క్రిష్టమస్ రోజు విడుదలై పాజిటివ్ టాక్ తో మల్టిప్లెక్స్ థియేటర్స్ లో అదరగొట్టేస్తుంది. వీక్ ప్రమోషన్స్ తో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకొచ్చిన మత్తువదలరా సినిమా మౌత్ టాక్ తోనే దూసుకుపోతుంది. చిన్న సినిమా… లో బడ్జెట్ సినిమా అన్నారు కానీ.. ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అనేది ఇప్పుడు బయటికొచ్చింది. మైత్రి వారు చాలా అంటే చాలా తక్కువ కేవలం రెండు కోట్లతో మత్తువదలరా సినిమా తెరకెక్కించారట.

ఆ రెండు కోట్లలో 1.3 కోట్లు సినిమా మేకింగ్ కోసం అంటే… గ్రాఫిక్స్ వర్క్, సెట్.. ఇలా అన్నిటికి కలిపి 1.3 కోట్లు అయితే.. నటుల పారితోషకాలతో కలిపి రెండు కోట్లు ఖర్చు మత్తువదలరా సినిమాకి అయ్యిందట. మరి దర్శకుడు చాలా తక్కువ బడ్జెట్ తో చాల తక్కువ సమయంలో ఈ సినిమాని అందరూ మెచ్చేలా చేసాడు. ఇక దర్శకుడు రితేష్ అయితే తన టీం తో కలిసి రెండు సిస్టమ్స్ పెట్టుకుని.. గ్రాఫిక్స్ వర్క్ తో పాటుగా డీఐ పనులను స్వయంగా చూసుకోవడంతో.. మైత్రి మూవీస్ వాళ్ళకి మరో 60 నుండి 70 లక్షలు సేవ్ అయ్యాయట. మరి నాలుగైదు కోట్లు ఖర్చు పెట్టాల్సిన సినిమాకి కేవలం రెండు కోట్లు పెట్టి.. ఇప్పుడు కోట్లలో కలెక్షన్స్ పోగేసుకుంటుంది మైత్రి మూవీస్.

Tags:    

Similar News